News June 11, 2024
గ్రూప్-2,3 పోస్టులు పెంచాలని CM రేవంత్కు విజ్ఞప్తి

TG: గ్రూప్-2, 3 నోటిఫికేషన్లలో పోస్టుల సంఖ్యను పెంచాలని చొప్పదండి MLA మేడిపల్లి సత్యం CM రేవంత్రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ‘చాలా కాలం తర్వాత ఆ నోటిఫికేషన్లు వచ్చాయి. గ్రూప్-1, DSC నోటిఫికేషన్లలో పోస్టుల సంఖ్యను పెంచినట్లే గ్రూప్-2, 3 పోస్టుల సంఖ్య పెంచి నిరుద్యోగులకు న్యాయం చేయాలి. DSC పరీక్షను ఆఫ్లైన్లో నిర్వహించాలి. గ్రూప్-2 ఎక్సైజ్ SI ఎత్తు 167.6 cms నుంచి 165కు తగ్గించాలి’ అని MLA కోరారు.
Similar News
News October 22, 2025
గుడ్ న్యూస్.. ట్రేడ్ డీల్ దిశగా ఇండియా, అమెరికా

భారత్, అమెరికా మధ్య ట్రేడ్ డీల్ అతి త్వరలోనే కుదిరే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. వాణిజ్య చర్చల్లో పురోగతి సాధించినట్లు సమాచారం. ఒకవేళ ఒప్పందం కుదిరితే ప్రస్తుతం 50 శాతంగా ఉన్న టారిఫ్స్ 15-16 శాతానికి తగ్గే అవకాశం ఉంది. కాగా రెండు దేశాల మధ్య ట్రేడ్ డీల్ చర్చలు స్నేహపూర్వక వాతావరణంలో జరుగుతున్నాయని కేంద్ర మంత్రి <<18044575>>పీయూష్ <<>>గోయల్ చెప్పిన విషయం తెలిసిందే.
News October 22, 2025
WWC: పాక్ ఔట్.. భారత్లోనే సెమీస్, ఫైనల్

నిన్న సౌతాఫ్రికా చేతిలో ఓటమితో ఉమెన్స్ వరల్డ్ కప్ నుంచి పాక్ క్రికెట్ జట్టు నిష్క్రమించిన విషయం తెలిసిందే. దీంతో సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్లు భారత్లోనే జరగనున్నాయి. పాక్ సెమీస్/ఫైనల్కు వెళ్తే ఆ మ్యాచ్లు శ్రీలంకలో నిర్వహించాలన్న ఉద్దేశంతో ICC ఇంకా వేదికలను ఖరారు చేయలేదు. ఇప్పుడు పాక్ ఇంటికెళ్లడంతో ఈనెల 29, 30 తేదీల్లో సెమీఫైనల్స్, NOV 2న ఫైనల్ INDలోనే నిర్వహించనుంది.
News October 22, 2025
నేడు బలి చక్రవర్తి భూమ్మీదకు వస్తాడట

నేటి నుంచి కార్తీక మాసం మొదలవుతుంది. ఈ నెలలో వచ్చే తొలి తిథిని బలి పాడ్యమి అంటారు. ఈ శుభదినాన బలి చక్రవర్తి భూలోకాన్ని చూడ్డానికి భూమ్మీదకు వస్తాడని పురాణాలు చెబుతున్నాయి. విష్ణువు వామనావతారంలో బలి చక్రవర్తిని పాతాళానికి పంపినప్పుడు ప్రతి ఏడాది 3 రోజులు భూలోకాన్ని పాలించే వరం ఇస్తాడు. ఆ 3 రోజుల్లో ఇదొకటి. నేడు దాన గుణుడైన బలిని స్మరిస్తూ, భక్తులు తమ ఇళ్లను దీపాలతో అలంకరించి, దానధర్మాలు చేస్తారు.