News June 12, 2024

టెట్ అర్హత సాధించని వారికి ప్రభుత్వం ఉపశమనం

image

TG: టెట్ అర్హత సాధించని వారికి ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. అర్హులు కాని అభ్యర్థులు వచ్చే టెట్‌కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశమిచ్చింది. అర్హత సాధించిన వారు డీఎస్సీకి ఉచితంగా అప్లై చేసుకోవచ్చని పేర్కొంది. ఎన్నికల కోడ్ వల్ల టెట్-2024 దరఖాస్తు ఫీజును ప్రభుత్వం తగ్గించలేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇవాళ టెట్ <<13426430>>ఫలితాలు<<>> వెలువడిన సంగతి తెలిసిందే.

Similar News

News September 12, 2025

‘మిరాయ్’ రివ్యూ&రేటింగ్

image

‘మిరాయ్’ అనే ఆయుధంతో హీరో దుష్టశక్తిని ఎదురించి లోకాన్ని ఎలా కాపాడారనేది స్టోరీ. మరోసారి తేజా సజ్జ నటనతో అలరించారు. చాన్నాళ్ల తర్వాత మంచు మనోజ్‌ మంచి క్యారెక్టర్‌తో సత్తాచాటారు. శ్రియ నటన, ఆమె పాత్ర మూవీకి ప్లస్. విజువల్స్, BGM బాగున్నాయి. క్లైమాక్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లు గ్రిప్పింగ్‌గా చెప్పాల్సింది. సెకండాఫ్‌లో నెరేషన్ కాస్త స్లోగా అన్పిస్తుంది.
రేటింగ్: 3/5

News September 12, 2025

ఏ సమయంలో ఏ మంత్రం చదవాలంటే?

image

ఆర్థిక సమస్యలు వేధించినప్పుడు: కనకధార స్తోత్రం
ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు: దుర్గా సప్తశతి
శక్తి సన్నగిల్లినప్పుడు: హనుమాన్ చాలీసా
కుటుంబ కలహాలు ఉన్నప్పుడు: గణేశ అథర్వశీర్షం
న్యాయపరమైన సమస్యలు ఎదురైనప్పుడు: సుందరకాండ
మనస్సు అశాంతిగా ఉన్నప్పుడు: శివాష్టకం
మార్గం తప్పినట్లు అనిపించినప్పుడు: విష్ణు సహస్రనామం

News September 12, 2025

వరి, మొక్కజొన్నలో విత్తనశుద్ధి

image

☛ వరి: పొడి విత్తనశుద్ధిలో కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బెండజిమ్ కలిపి 24 గంటల తర్వాత నారుమడిలో చల్లుకోవాలి. అదే దమ్ము చేసిన నారుమడికైతే లీటరు నీటికి 1 గ్రాము కార్బెండజిమ్ మందు కలిపిన ద్రావణంలో విత్తనాలను 24 గంటలు నానబెట్టి మండె కట్టి నారుమడిలో చల్లాలి. మొక్కజొన్న: కిలో విత్తనానికి 3 గ్రాముల మాంకోజెబ్ మందుతో విత్తనశుద్ధి చేయడం వల్ల మొదటి దశలో వచ్చే తెగుళ్ల నుంచి మొక్కజొన్న పంటను కాపాడుకోవచ్చు.