News June 12, 2024
ధర్మవరం ప్రజలకు రుణపడి ఉంటా: సత్యకుమార్ యాదవ్

AP: బీజేపీలో కష్టపడి పనిచేసే సామాన్య కార్యకర్తలకు ఎప్పుడూ గుర్తింపు లభిస్తుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ‘ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే మంత్రిగా అవకాశం కల్పించిన ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, సీఎం చంద్రబాబుకి ధన్యవాదాలు. నాపై నమ్మకం ఉంచిన పార్టీ నాయకత్వానికి, నన్ను ఆదరించిన ధర్మవరం ప్రజలకు రుణపడి ఉంటా. ఎన్నికల హామీలను అమలు చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తా’ అని ట్వీట్ చేశారు.
Similar News
News September 12, 2025
‘మిరాయ్’ రివ్యూ&రేటింగ్

‘మిరాయ్’ అనే ఆయుధంతో హీరో దుష్టశక్తిని ఎదురించి లోకాన్ని ఎలా కాపాడారనేది స్టోరీ. మరోసారి తేజా సజ్జ నటనతో అలరించారు. చాన్నాళ్ల తర్వాత మంచు మనోజ్ మంచి క్యారెక్టర్తో సత్తాచాటారు. శ్రియ నటన, ఆమె పాత్ర మూవీకి ప్లస్. విజువల్స్, BGM బాగున్నాయి. క్లైమాక్స్ గూస్బంప్స్ తెప్పిస్తుంది. ఫస్టాఫ్లో కొన్ని సీన్లు గ్రిప్పింగ్గా చెప్పాల్సింది. సెకండాఫ్లో నెరేషన్ కాస్త స్లోగా అన్పిస్తుంది.
రేటింగ్: 3/5
News September 12, 2025
ఏ సమయంలో ఏ మంత్రం చదవాలంటే?

ఆర్థిక సమస్యలు వేధించినప్పుడు: కనకధార స్తోత్రం
ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు: దుర్గా సప్తశతి
శక్తి సన్నగిల్లినప్పుడు: హనుమాన్ చాలీసా
కుటుంబ కలహాలు ఉన్నప్పుడు: గణేశ అథర్వశీర్షం
న్యాయపరమైన సమస్యలు ఎదురైనప్పుడు: సుందరకాండ
మనస్సు అశాంతిగా ఉన్నప్పుడు: శివాష్టకం
మార్గం తప్పినట్లు అనిపించినప్పుడు: విష్ణు సహస్రనామం
News September 12, 2025
వరి, మొక్కజొన్నలో విత్తనశుద్ధి

☛ వరి: పొడి విత్తనశుద్ధిలో కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బెండజిమ్ కలిపి 24 గంటల తర్వాత నారుమడిలో చల్లుకోవాలి. అదే దమ్ము చేసిన నారుమడికైతే లీటరు నీటికి 1 గ్రాము కార్బెండజిమ్ మందు కలిపిన ద్రావణంలో విత్తనాలను 24 గంటలు నానబెట్టి మండె కట్టి నారుమడిలో చల్లాలి. మొక్కజొన్న: కిలో విత్తనానికి 3 గ్రాముల మాంకోజెబ్ మందుతో విత్తనశుద్ధి చేయడం వల్ల మొదటి దశలో వచ్చే తెగుళ్ల నుంచి మొక్కజొన్న పంటను కాపాడుకోవచ్చు.