News June 14, 2024

ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కసరత్తు

image

TG: ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజల నుంచి వచ్చిన 82.82 లక్షల దరఖాస్తుల పరిశీలనకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. అలాగే వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న గృహ నిర్మాణ పథకాలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించింది. ఏడాదికి 4.50 లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. దరఖాస్తులు ఎక్కువగా వచ్చిన నేపథ్యంలో లబ్ధిదారులను లాటరీ విధానంలో ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

Similar News

News November 7, 2025

APPLY NOW: AVNLలో ఉద్యోగాలు

image

చెన్నై ఆవడిలోని ఆర్మ్‌డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ (<>AVNL<<>>) 5 డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 22 వరకు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీఈ, బీటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ(CS)ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు 300, SC, ST, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. వెబ్‌సైట్: https://ddpdoo.gov.in/

News November 7, 2025

రబీలో సాగుచేసే వరి రకాలకు ఉండాల్సిన లక్షణాలు

image

రబీ(యాసంగి)లో సాగు నీటి లభ్యతను బట్టి వరిని సాగు చేయాలి. అలాగే విత్తుకొనే వరి రకాల పంట కాలం 120-130 రోజుల మధ్య ఉండాలి. ముఖ్యంగా అగ్గి తెగులు, దోమ పోటును తట్టుకొనే రకాలై ఉండాలి. వర్షాలకు పైరు పడిపోని రకాలను ఎన్నుకోవాలి. మెడవిరుపును తట్టుకోవాలి. చలిని తట్టుకొని పిలకలు బాగా చేయగలగాలి. గింజరాలడం తక్కువగా ఉండాలి. మేలైన గింజ నాణ్యత కలిగి మంచి ధర వచ్చే వరి రకాలను ఎన్నుకోవాలంటున్నారు వ్యవసాయ నిపుణులు.

News November 7, 2025

DEC నుంచి మొబైల్ రీఛార్జ్ ధరలు పెంపు?

image

ప్రైవేట్ టెలికం కంపెనీలు డిసెంబర్ 1 నుంచి రీఛార్జ్ రేట్లను పెంచే అవకాశం ఉందని నేషనల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. దాదాపు 10% వరకు పెరగవచ్చని పేర్కొన్నాయి. 5G సర్వీస్ విస్తరణ, నెట్‌వర్క్ మెయింటనెన్స్ ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు, రెవెన్యూ పెంచుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. టారిఫ్స్ పెంచితే ఉదాహరణకు రోజుకు 2GB 84 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్లాన్ ధర రూ.949 నుంచి రూ.999కి పెరిగే అవకాశం ఉంది.