News June 17, 2024
రియల్ హీరో.. విశ్వక్సేన్పై ప్రశంసలు

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ మరణానంతరం అవయవదానం చేయాలని నిర్ణయించుకున్నారు. ‘మెట్రో రెట్రో’ పేరిట జరిగిన కార్యక్రమలో ఈ ప్రతిజ్ఞ చేశానని ఆయన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ఇది కాస్త వైరల్గా మారింది. దీంతో విశ్వక్ నిర్ణయంపై నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. రియల్ హీరో అనిపించుకున్నారని కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ నుంచి విజయ్ దేవరకొండ, జగపతి బాబు అవయవదానం ప్రతిజ్ఞ చేశారు.
Similar News
News March 18, 2026
గ్యాస్ కొరత: ఇన్స్టంట్ ఫుడ్ సేల్స్లో 20% జంప్

వంట గ్యాస్ కొరత తీవ్రం కావడంతో ప్రజలు ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపుతున్నారు. సిలిండర్ బుక్ చేసినా డెలివరీ ఆలస్యం అవుతుండటంతో ఇన్స్టంట్ నూడుల్స్, ఉప్మా మిక్స్, రెడీమేడ్ పులిహోర వంటి వాటిపై ఆధారపడుతున్నారు. దీంతో రెడీ-టు-ఈట్ ఫుడ్స్, ఫ్రోజెన్ స్నాక్స్ సేల్స్ 20% పెరిగాయి. సూపర్ మార్కెట్లలో కొన్ని రోజులుగా ఇన్స్టంట్ ఫుడ్ సెక్షన్లలో స్టాక్ వేగంగా ఖాళీ అవుతోందని వ్యాపారులు చెబుతున్నారు.
News March 18, 2026
గ్రాము బంగారం ₹లక్ష.. రాబర్ట్ కియోసాకి అంచనా

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో త్వరలో భారీ కుదుపు తప్పదని ‘రిచ్ డాడ్.. పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి అంచనా వేశారు. అది జరిగిన ఏడాది వ్యవధిలో బంగారం, వెండి ధరలు ఊహించని రీతిలో పెరుగుతాయన్నారు. గ్రాము గోల్డ్ ధర దాదాపు ₹లక్ష, గ్రాము వెండి ధర ₹540కి చేరే అవకాశం ఉందన్నారు. బిట్కాయిన్ $7,50,000, ఎథీరియం $95,000కు చేరతాయని తెలిపారు. తెలివైన ఇన్వెస్టర్లు దీన్నుంచి భారీగా సంపాదించుకుంటారని పేర్కొన్నారు.
News March 18, 2026
సంచలనం.. డ్రగ్స్ మాఫియాతో రోహిత్ రెడ్డికి లింక్?

TG: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డ్రగ్స్ మాఫియాతో BRS మాజీ MLA పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఆయన సూచనతో డ్రైవర్ శరత్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అభిషేక్ సింగ్ వద్ద డ్రగ్స్ కొన్నట్లు నిర్ధారించినట్లు తెలుస్తోంది. దీంతో అభిషేక్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక రోహిత్ రెడ్డి, రితేశ్ రెడ్డి, నమిత్లపై హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి.


