News June 17, 2024
ఆహారంలో పాము పిల్ల.. అస్వస్థతకు గురైన విద్యార్థులు
బిహార్లోని ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థుల ఆహారంలో పాము పిల్ల కలకలం రేపింది. దీంతో 10 మందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. ఆహారంలో చచ్చిపోయిన పాము పిల్ల వచ్చినట్లు స్టూడెంట్స్ ఆరోపించారు. గతంలోనూ ఫుడ్ విషయమై ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకోలేదని వాపోయారు. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. మెస్ ఓనర్కు పెనాల్టీ విధించినట్లు పేర్కొన్నారు.
Similar News
News February 2, 2025
T20 WC: 82కే సౌతాఫ్రికా ఆలౌట్
అండర్-19 ఉమెన్స్ టీ20 WC ఫైనల్లో భారత బౌలర్లు విజృంభించారు. దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 82 పరుగులకే ఆలౌటైంది. తెలుగమ్మాయి త్రిష 3 వికెట్లతో సత్తా చాటారు. ఆయుషి శుక్లా, వైష్ణవి శర్మ, పరుణిక రెండేసి వికెట్లతో ఆకట్టుకున్నారు. భారత విజయలక్ష్యం 83.
News February 2, 2025
తిరుపతి తొక్కిసలాట ఘటన.. విచారణకు హాజరైన ఈవో, ఎస్పీ
తిరుపతి తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ కొనసాగుతోంది. తిరుపతి కలెక్టరేట్లో జస్టిస్ సత్యనారాయణమూర్తి ఎదుట టీటీడీ ఈవో శ్యామలరావు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు విచారణకు హాజరయ్యారు. గత నెల వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోగా, 40 మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే.
News February 2, 2025
నాని ‘ప్యారడైజ్’కు మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్.. ఎవరంటే
నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రానున్న ‘ది ప్యారడైజ్’కు మ్యూజిక్ డైరెక్టర్గా అనిరుధ్ రవిచందర్ ఖరారయ్యారు. మూవీ టీమ్ ఈ విషయాన్ని అనౌన్స్ చేసింది. ‘ఇప్పుడు అధికారికంగా అనిరుధ్ను సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నాం. ఇక తగలబెట్టేద్దాం’ అని ట్వీట్ చేసింది. నాని, అనిరుధ్ కాంబోలో జెర్సీ, గ్యాంగ్ లీడర్ సినిమాలు రాగా ‘ప్యారడైజ్’ మూడోది కానుంది. అటు నానికి శ్రీకాంత్ ఓదెలతో ‘దసరా’ తర్వాత ఇది రెండో సినిమా.