News June 17, 2024
పన్నూ హత్య కుట్ర కేసు.. అమెరికాకు నిఖిల్ గుప్తా అప్పగింత
ఖలీస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య కుట్ర కేసులో భారతీయుడు నిఖిల్ గుప్తాను చెక్ రిపబ్లిక్ దేశం అమెరికాకు అప్పగించింది. ఇవాళ అతణ్ని ఫెడరల్ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉందని పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. కాగా అమెరికా గడ్డపై గురుపత్వంత్ హత్యకు నిఖిల్ మరొక భారత ఉద్యోగితో కలిసి ప్లాన్ వేశారని US ఆరోపిస్తోంది. ఈ కుట్రలో తమ పాత్ర ఏమీ లేదని ఇప్పటికే భారత్ స్పష్టం చేసింది.
Similar News
News October 7, 2024
ఇజ్రాయెల్, హమాస్ యుద్ధానికి ఏడాది
ఇజ్రాయెల్, హమాస్ యుద్ధానికి ఏడాది పూర్తి అయింది. 2023, అక్టోబర్ 7న హమాస్ టెర్రరిస్టులు ఇజ్రాయెల్లోకి చొరబడి విధ్వంసం సృష్టించారు. పిల్లలు, యువతుల్ని బందీలుగా తీసుకెళ్లడంతో పాలస్తీనాలో IDF ఏరివేత మొదలు పెట్టింది. దీంతో లక్షలాది ప్రజలు నిరాశ్రయులు అయ్యారు. మధ్యలో బందీలను ఎక్స్ఛేంజ్ చేసుకున్నా హెజ్బొల్లా దూరడంతో వివాదం మరో టర్న్ తీసుకుంది. ఇప్పుడు ఇరాన్తో ప్రత్యక్ష యుద్ధం స్థాయికి చేరింది.
News October 7, 2024
జగన్ పుంగనూరు పర్యటన రద్దు: పెద్దిరెడ్డి
AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ పుంగనూరు పర్యటన రద్దయినట్లు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. హత్యకు గురైన ఆరేళ్ల చిన్నారి కుటుంబాన్ని ఎల్లుండి పరామర్శించాల్సి ఉండగా అనివార్య కారణాలతో రద్దు చేసుకున్నట్లు చెప్పారు. జగన్ పర్యటిస్తారనే భయంతోనే ముగ్గురు మంత్రులు ఆఘమేఘాల మీద ఇక్కడికొచ్చారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి ఘటనల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
News October 7, 2024
అదృష్టంతో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచారు: కాంగ్రెస్ ఎంపీ
రాహుల్ గాంధీ, డీఎంకే నేతలపై విమర్శలు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై తమిళనాడు ఎంపీ(INC) తిరునావుక్కరసర్ మండిపడ్డారు. ఆయన అదృష్టం కొద్దీ ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారని ఎద్దేవా చేశారు. తమిళనాడు నేతలను విమర్శించే స్థాయి ఆయనకు లేదని, అంతపెద్ద నాయకుడేమీ కాదని చెప్పారు. పవన్ రాజకీయాల్లోకి హఠాత్తుగా వచ్చిన వ్యక్తి అని, వీధుల్లో వెలిసే విగ్రహం వంటివారని పేర్కొన్నారు.