News June 18, 2024

డబుల్ ఇంజిన్ సర్కారుతో ఏపీని నంబర్-1 చేస్తాం: సత్యకుమార్ యాదవ్

image

AP: గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు తిరోగమించిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. ధర్మవరంలో మాట్లాడుతూ.. వైసీపీ నేతలు అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి సహజ వనరులను దోచుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారు ద్వారా ఏపీని నంబర్-1 చేస్తామని తెలిపారు. చితికిపోయిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతామని చెప్పారు.

Similar News

News March 17, 2026

పశ్చిమాసియాలో ఉద్రిక్తత.. సానియా మీర్జాకు భయానక అనుభవం!

image

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన కుమారుడు ఇజ్‌హాన్‌తో కలిసి దుబాయ్ నుంచి భారత్‌కు చేరుకున్నారు. అక్కడ తాను ఎదుర్కొన్న భయానక పరిస్థితుల గురించి ఆమె మీడియాకు వివరించారు. ‘మేమున్న ఇంటి పైనుంచే యుద్ధ విమానాలు వెళ్లడం, అవి ఒకదానినొకటి అడ్డుకోవడం చూశాం. మా ఇంటికి 400-500 మీటర్ల దూరంలోనే విమానాల శకలాలు పడ్డాయి’ అని తెలిపారు.

News March 17, 2026

దీదీని ఓడించేందుకు BJP మాస్టర్ ప్లాన్!

image

<<19408277>>మమతా బెనర్జీ<<>>ని ఆమె కోటలోనే కట్టడి చేసేందుకు BJP మాస్టర్ ప్లాన్ వేసింది. బలమైన నేత సువేందును పోటీకి దింపి దీదీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయకుండా అడ్డుకట్ట వేయనుంది. 2021లో నందిగ్రామ్‌లో మమతను ఓడించిన ఆయన ఇప్పుడు భవానీపూర్‌లోనూ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో గుజరాతీ, మార్వాడీ వంటి నాన్-బెంగాలీ ఓటర్లు 40% ఉండటంతో ఇక్కడ పోటీ టఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీదీని డిఫెన్స్‌లో పడేయాలన్నది BJP అసలు స్కెచ్.

News March 17, 2026

హోటల్స్ మూత… అన్న క్యాంటీన్లకు తాకిడి

image

AP: నిన్న మొన్నటి వరకు కొద్దోగొప్పో తెరిచి ఉన్న హోటళ్లు వాణిజ్య LPG కొరతతో మూతపడుతున్నాయి. ఆ ప్రభావం అన్న క్యాంటీన్లపై పడుతోంది. ఇదివరకు ఒక్కో క్యాంటీన్‌ ద్వారా మధ్యాహ్నం 500మందికి మీల్స్ అందించేవారు. హోటల్స్ మూతతో అదనంగా 150 మీల్స్ సరఫరా చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గతంలో 3PM వరకు మీల్స్ అందించగా ఇప్పుడు ఉద్యోగులు, విద్యార్థులూ వస్తుండడంతో 2PMకల్లా భోజనాలు అయిపోతున్నట్లు చెబుతున్నారు.