News June 19, 2024
బుల్ జోరు.. సరికొత్త గరిష్ఠాలను తాకిన సూచీలు

ట్రేడింగ్ సెషన్ ఓపెనింగ్లో దేశీయ స్టాక్ మార్కెట్లు జోరు కొనసాగిస్తున్నాయి. ఈరోజు కూడా లాభాలతో ప్రారంభమైన సూచీలు సరికొత్త గరిష్ఠాలను తాకాయి. గరిష్ఠంగా 77,581ను తాకిన సెన్సెక్స్ ప్రస్తుతం 160 పాయింట్ల లాభంలో 77,454 వద్ద కొనసాగుతోంది. మరోవైపు ఓ దశలో 23,630 మార్క్ అందుకున్న నిఫ్టీ ప్రస్తుతం 23,587 వద్ద ట్రేడవుతోంది. బ్యాంకింగ్, ఐటీ రంగాల్లో లాభాలు, బడ్జెట్పై అంచనాలు మార్కెట్లకు కలిసొచ్చాయి.
Similar News
News November 5, 2025
పిల్లల ముందు ఆ పనులు వద్దు!

పేరెంట్స్ ఏది చేస్తే చిన్న పిల్లలు వాటినే అనుకరిస్తారు. కొంతమంది భార్యాభర్తలు కిడ్స్ ముందే రొమాన్స్ చేస్తుంటారు. అది వారి మెదడుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అలాగే పిల్లల ముందు ఇతరులను తక్కువ చేసి మాట్లాడటం, అనుచితంగా ప్రవర్తించడం వల్ల వాళ్లూ అలాగే తయారయ్యే ప్రమాదం ఉంటుంది. ఇక చిన్నారుల ముందు మందు తాగడం, సిగరెట్లు కాల్చడం వల్ల వారూ చెడు అలవాట్లకు గురయ్యే ఆస్కారం ఉంది. Share It
News November 5, 2025
ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించిన అమెరికా

ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ‘Minuteman-III’ను అమెరికా పరీక్షించింది. కాలిఫోర్నియాలోని స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి ఈ ప్రయోగం చేపట్టింది. అణు సామర్థ్యం గల ఈ మిసైల్ 6,760 KM ప్రయాణించి మార్షల్ ఐలాండ్స్లోని రొనాల్డ్ రీగన్ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ టెస్ట్ సైట్లో ల్యాండ్ అయింది. న్యూక్లియర్ వెపన్ టెస్టింగ్ తిరిగి ప్రారంభిస్తామని ట్రంప్ ప్రకటించిన కొద్ది రోజులకే ఈ పరీక్ష నిర్వహించడం గమనార్హం.
News November 5, 2025
కార్తీక పౌర్ణమి.. వెలుగు జిలుగుల్లో కాశీ

దేశంలో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. కాశీ పుణ్యక్షేత్రం దీపాల వెలుగుల్లో మెరిసిపోయింది. గంగా నది ఒడ్డున కాశీ ఘాట్ను వేలాది విద్యుత్ లైట్లతో అలంకరించారు. ఇందుకు సంబంధించిన డ్రోన్ ఫొటోలు అబ్బురపరుస్తున్నాయి. ప్రధాని మోదీ ఈ ఫొటోలను Xలో షేర్ చేశారు.


