News June 19, 2024

ఈ ఏడాది దేశాన్ని వీడనున్న 4300మంది శ్రీమంతులు!

image

ఈ ఏడాది 4300మంది శ్రీమంతులు భారత్‌ను వీడనున్నారని హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ సంస్థ అంచనా వేసింది. అత్యధికులు యూఏఈని తమ గమ్యస్థానంగా ఎంచుకుంటున్నారని వెల్లడించింది. గత ఏడాది ఈ సంఖ్య 5100గా ఉండటం గమనార్హం. చైనా, యూకే తర్వాత ఆ స్థాయిలో మిలియనీర్లు తరలిపోతున్న దేశంగా భారత్ ఉందని వివరించింది. మొత్తంగా ఈ ఏడాది 1.28లక్షలమంది యూఏఈ లేదా అమెరికాకు వలస వెళ్తారని సంస్థ అభిప్రాయపడింది.

Similar News

News October 8, 2024

ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్

image

TG: కేంద్రం అందిస్తోన్న ‘నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్’కు ఇంటర్ పాసైన విద్యార్థులు ఈనెల 31 వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఇంటర్ బోర్డు తెలిపింది. అలాగే గతంలో అప్లై చేసుకున్నవారు ఇదే గడువులోగా రెన్యువల్ చేసుకోవచ్చని పేర్కొంది. ఈ ఏడాది టాప్-20 పర్సంటైల్ వచ్చిన విద్యార్థులు 59,355 మంది ఉన్నారని తెలిపింది. దరఖాస్తు చేసుకోవడానికి ఈ <>వెబ్‌సైట్‌<<>>ను సందర్శించండి.

News October 8, 2024

నేడే రిజల్ట్స్: గెలుపెవరిదో?

image

హరియాణా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరి కొన్ని గంటల్లో వెలువడనున్నాయి. ఇప్పటికే ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎగ్జిట్ పోల్స్ దాదాపు కాంగ్రెస్‌ కూటమికే అనుకూలంగా రాగా బీజేపీ మాత్రం గెలుపుపై ధీమాగా ఉంది. దీంతో ఫలితాలపై మరింత ఆసక్తి నెలకొంది.

News October 8, 2024

శ్రీవారి గరుడోత్సవం.. 3 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం

image

శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన గరుడోత్సవం నేడు జరగనుంది. దాదాపు 3 లక్షల మంది భక్తులు తిరుమలకు వచ్చే అవకాశం ఉండటంతో RTC బస్సులలో వారిని కొండపైకి తరలించేందుకు TTD అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే టూవీలర్స్, టాక్సీలను కొండపైకి నిషేధించారు. కాగా గరుడు వాహన సేవ సా.6.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కొనసాగేలా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు.