News June 22, 2024
అమరావతిలో ముళ్ల కంపల తొలగింపునకు చర్యలు: మంత్రి
AP: అమరావతి ప్రాంతంలో ముళ్ల కంపలను తొలగించేందుకు టెండర్లు పిలుస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి ప్రాంతంలో పర్యటించిన చంద్రబాబు వీటిని వెంటనే తొలగించాలని ఆదేశాలిచ్చారని చెప్పారు. 217 చదరపు కిలోమీటర్లలో మెజార్టీ ఏరియా అడవిలా తయారైందని చెప్పారు. ముళ్ల కంపలను తొలగించిన తర్వాత ఎంత మేర నష్టం జరిగిందనే దానిపై అంచనాకు వస్తామని పేర్కొన్నారు. ఆ తర్వాత పనులను ప్రారంభిస్తామన్నారు.
Similar News
News October 9, 2024
నేడు విజయవాడ దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం
నేడు విజయవాడ దుర్గమ్మకు AP సీఎం చంద్రబాబు సతీసమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఇవాళ మూల నక్షత్రం కావడంతో అమ్మవారు సరస్వతీ మాతగా దర్శనమివ్వనున్నారు. ఈ క్రమంలో దుర్గమ్మను వీక్షించేందుకు ఇంద్రకీలాద్రికి 2 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. క్యూలైన్లలో నీరు, మజ్జిగ, పాలు పంపిణీ చేస్తామని మంత్రి ఆనం నారాయణ రెడ్డి తెలిపారు.
News October 9, 2024
నిలవాలంటే గెలవాల్సిందే..
మహిళల టీ20 వరల్డ్ కప్లో భారత జట్టు ఇవాళ శ్రీలంకతో తలపడనుంది. ఆడిన రెండు మ్యాచుల్లో ఒకే విజయం సాధించిన టీమ్ ఇండియా ఈ మ్యాచ్లో తప్పక గెలవాల్సి ఉంది. విజయం సాధిస్తే సెమీస్ ఆశలు పదిలం కానున్నాయి. నిన్న ఆస్ట్రేలియాపై భారీ తేడాతో న్యూజిలాండ్ ఓటమి భారత్కు కాస్త ప్లస్గా మారింది. కాగా మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రసారం కానుంది.
News October 9, 2024
విదేశీ విద్య: ఏ ఇన్టేక్ మంచిది..?
విదేశీ విద్యకు వెళ్లాలంటే ఫాల్, సమ్మర్ అనే రెండు సీజన్లుంటాయి. ఫాల్ ఇన్టేక్ ఏటా ఆగస్టు చివరిలో లేదా సెప్టెంబరులో స్టార్ట్ అవుతుంది. వర్సిటీలు విస్తృత కోర్సులు ఆఫర్ చేస్తాయి. ఎక్కువశాతం మంది ఎంచుకునే ఆప్షన్ ఇది. పార్ట్ టైమ్ అవకాశాలు బాగుంటాయి. ఇక సమ్మర్ ఇన్టేక్ అంటే ఏటా మే నుంచి ఆగస్టు వరకు ఉంటుంది. చదువు త్వరగా పూర్తి చేయాలనుకునేవారు ఈ ఇన్టేక్ గురించి ఆలోచించొచ్చని నిపుణులు చెబుతున్నారు.