News June 22, 2024

బీజేపీ స్టేట్ చీఫ్ ఎవరు? నేతల వ్యాఖ్యలకు అర్థమేంటి?

image

TG: రాష్ట్రంలో కాషాయ దళపతి ఎవరనే ఉత్కంఠ కొనసాగుతున్న వేళ బీజేపీలోని నేతల వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కొత్త నీరు, కొత్త నాయకత్వం అవసరమంటూ ఈటల కామెంట్ చేయగా.. దేశం, ధర్మం, పార్టీపై భక్తి ఉన్నవారికే పగ్గాలు ఇవ్వాలని రాజాసింగ్ అన్నారు. దీంతో వీరిద్దరూ చీఫ్ పదవి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రఘునందన్, డీకే అరుణ, ధర్మపురి అర్వింద్ కూడా పోటీ పడుతున్నట్లు సమాచారం.

Similar News

News October 9, 2024

వారు రుణమాఫీకి దరఖాస్తు చేసుకోవచ్చు: కోదండరెడ్డి

image

TG: అర్హులైన రైతులు రుణమాఫీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వ్యవసాయ కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి తెలిపారు. సాంకేతిక కారణాలతో కొంతమందికి రుణమాఫీ కాలేదని వ్యవసాయ శాఖ గుర్తించిందన్నారు. ఇప్పటికే ఆరు లక్షల దరఖాస్తులు పరిష్కరించామన్నారు. రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ, బీఆర్ఎస్ రుణమాఫీపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. అర్హులందరికీ రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.

News October 9, 2024

నాగార్జునVSసురేఖ: ఈనెల 10న మరో వ్యక్తి వాంగ్మూలం రికార్డు

image

తమ కుటుంబంపై మంత్రి సురేఖ ఆరోపణలను ఖండిస్తూ హీరో నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం దావా కేసు విచారణ ఈనెల 10కి వాయిదా పడింది. ఆరోజు మరో సాక్షి వాంగ్మూలం రికార్డు చేస్తామని నాగ్ తరఫు లాయర్ అశోక్‌రెడ్డి తెలిపారు. అదే రోజు మంత్రికి నోటీసులు జారీ చేసే అవకాశముందన్నారు. అటు నాగార్జున పిటిషన్ నిలబడదని సురేఖ న్యాయవాది తిరుపతివర్మ అన్నారు. ఆయన పిటిషన్‌లో ఒకలా, కోర్టు వాంగ్మూలంలో మరోలా చెప్పారన్నారు.

News October 9, 2024

నేడు టీడీపీలో చేరనున్న మస్తాన్ రావు, మోపిదేవి

image

AP: వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ నేడు టీడీపీలో చేరనున్నారు. ఉండవల్లిలోని నివాసంలో వారిద్దరికి సీఎం చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల వీరిద్దరూ వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు.