News June 23, 2024
కల్తీ మద్యం కుట్ర వెనుక అన్నామలై: DMK నేత
తమిళనాడులో కల్తీ మద్యం తయారీకి ఉపయోగించిన మిథనాల్ను NDA పాలిత పుదుచ్చేరి నుంచి సేకరించారని డీఎంకే నేత ఆర్ఎస్ భారతి తెలిపారు. ఈ కుట్రను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై అమలు చేశారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు జరిగిందా అనే సందేహం ఉందన్నారు. ఈ మరణాలకు బాధ్యత వహించి CM స్టాలిన్ రాజీనామా చేయాలనడం సరికాదన్నారు. ఎవరైనా రిజైన్ చేయాల్సి వస్తే అది పుదుచ్చేరి సీఎం, బీజేపీ మంత్రులేనని స్పష్టం చేశారు.
Similar News
News October 9, 2024
గ్రూప్-1 మెయిన్స్పై కీలక అప్డేట్
TG: గ్రూప్-1 మెయిన్స్ హాల్ టికెట్లను ఈనెల 14న విడుదల చేయనున్నట్లు TGPSC ప్రకటించింది. అదే రోజు నుంచి కమిషన్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈనెల 21 నుంచి 27వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే.
News October 9, 2024
JOE ROOT: ‘గే’ అని గేలి చేసినా..!
టెస్టు క్రికెట్లో ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ అన్స్టాపబుల్గా దూసుకెళ్తున్నారు. గత నాలుగేళ్లలో అత్యుత్తమ ఫామ్ ప్రదర్శించి ఏకంగా 18 సెంచరీలు బాదారు. కాగా రూట్ 2021కు ముందు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. తరచూ ఆయనను ప్రత్యర్థులు ‘గే’ అంటూ ఎగతాళి చేసేవారు. ఆయన వాటినేం పట్టించుకోకుండా ఆటపైనే దృష్టి పెట్టేవారు. అతడిని ‘గే’ అని పిలిచినందుకు వెస్టిండీస్ బౌలర్ గాబ్రియేల్ 4 మ్యాచ్ల నిషేధం కూడా ఎదుర్కొన్నారు.
News October 9, 2024
3 రోజుల్లోనే ఖాతాల్లోకి డబ్బులు: మంత్రి
TG: ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత 3 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. నల్గొండ(D) అర్జాలబావి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. సన్న రకాల సాగును ప్రోత్సహించేందుకే రూ.500 బోనస్ ఇస్తున్నామని అన్నారు. రుణమాఫీ కాని రైతులకు వారం రోజుల్లో పూర్తవుతుందని చెప్పారు.