News June 25, 2024

జన్‌విశ్వాస్ బిల్లు 2.0తో వ్యాపార వర్గాలకు ఊరట?

image

త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో జన్‌విశ్వాస్ బిల్లు 2.0తో కేంద్రం ఇన్వెస్టర్లకు ఊరట కల్పించే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. ‘వివిధ చట్టాల్లోని 580 నిబంధనల్లో 310 ప్రావిజన్లను కొనసాగించనుంది. మిగిలిన వాటిలో శిక్షల తీవ్రత తగ్గించే అంశాన్ని పరిశీలిస్తోంది. TDS చెల్లింపులు లేట్ కావడం వంటి నేరాలకు శిక్షను జరిమానాకు పరిమితం చేయొచ్చు. CGST చట్టాన్నీ సమీక్షిస్తోంది’ అని తెలిపాయి.

Similar News

News January 13, 2026

రాష్ట్రాన్ని అగ్నిగుండంగా చేస్తామంటే ఊరుకోం: పొంగులేటి

image

TG: జిల్లాల విషయంలో బీఆర్ఎస్ నేతలు ప్రజలను రెచ్చగొడుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫైరయ్యారు. అశాస్త్రీయంగా చేసిన జిల్లాలను మళ్లీ శాస్త్రీయంగా మారుస్తామని సీఎం రేవంత్ చెప్పారని తెలిపారు. రాష్ట్రాన్ని <<18838995>>అగ్నిగుండంగా<<>> చేస్తామంటే చూస్తూ ఊరుకోమని బదులిచ్చారు. వచ్చే ఎన్నికల్లో 100 పర్సెంట్ విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు.

News January 13, 2026

పసుపును ఆరబెట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

పసుపును ఉడకబెట్టిన తర్వాత శుభ్రం చేసిన పదునైన నేల లేదా టార్పాలిన్ షీట్ లేదా సిమెంట్ నేలపై కుప్పగా పోయాలి. ఒకరోజు తర్వాత 2,3 అంగుళాల మందం ఉండేలా పరచాలి. మరీ పలుచగా పరిస్తే పసుపు రంగు చెడిపోతుంది. పరిచిన పసుపును మధ్యాహ్నం సమయంలో తిరగబెడితే సమానంగా ఎండుతాయి. పసుపు దుంపలు లేదా కొమ్ముల్లో తేమ 8 శాతం వచ్చే వరకు ఎండబెట్టాలి. ఈ స్థితికి రావడానికి 18- 20 రోజులు పడుతుంది. రాత్రివేళ టార్పాలిన్లు కప్పాలి.

News January 13, 2026

సంక్రాంతి: ముగ్గులు వేస్తున్నారా?

image

సంక్రాంతి పండుగకు ముగ్గులు వేయడం మన సంప్రదాయం. అయితే అందులో బియ్యప్పిండి కలపడం ద్వారా చీమలు, పక్షులు వంటి చిన్న జీవులకు ఆహారం అందించిన వాళ్లమవుతాం. పూర్వం ముగ్గులో బియ్యప్పిండి కలిపే వేసేవారు. ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలను ఉంచి, పూలతో అలంకరించడం వల్ల ఆ ప్రాంతం మహాలక్ష్మికి నివాసంగా మారుతుందని నమ్మకం. రథాల ముగ్గులు వేయడం వల్ల అమ్మాయిలలో సృజనాత్మకత పెరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.