News June 26, 2024

ఏపీ అభివృద్ధికి సాధ్యమైనంత కృషి చేస్తాం: ప్రధాని మోదీ

image

AP: టీడీపీకి చెందిన 16 మంది ఎంపీలు తనను కలవడంపై ప్రధాని మోదీ Xలో పోస్ట్ పెట్టారు. ‘టీడీపీకి చెందిన సభ్యులు కలిశారు. నా మిత్రుడు చంద్రబాబు నాయకత్వంలో మా పార్టీలు కేంద్రంలో, ఏపీలో చాలా సన్నిహితంగా పనిచేస్తున్నాయి. భారతదేశ ప్రగతికి, ఏపీ అభివృద్ధికి సాధ్యమైనదంతా చేస్తాం’ అని రాసుకొచ్చారు.

Similar News

News January 27, 2026

రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్

image

ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ కేన్ రిచర్డ్‌సన్(34 ఏళ్లు) క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. కేన్ 25 వన్డేలు, 36 T20Iలు ఆడారు. 2021 T20 వరల్డ్‌కప్ గెలిచిన ఆసీస్ టీమ్‌లో సభ్యుడిగా ఉన్నారు. బిగ్ బాష్ లీగ్‌లో అన్ని సీజన్లలో ఆడిన కొద్దిమందిలో రిచర్డ్‌సన్ ఒకరు. BBLలో 142 వికెట్లు తీశారు. ఐపీఎల్‌ సహా పలు లీగ్‌ల్లోనూ ఆడి తనదైన ముద్ర వేశారు. IPLలో RCB, RR, PWI తరఫున ఆడారు.

News January 27, 2026

మునగలో కాయతొలుచు ఈగ నివారణకు సూచనలు

image

మునగ పంటలో విత్తనాలు నాటిన 5 నెలలకు పూత దశ ప్రారంభమవుతుంది. ఈ సమయంలో పంటకు కాయ తొలుచు ఈగ ముప్పు ఎక్కువ. ఇది పంటను ఆశించి పిందె దశలో కాయలోకి ప్రవేశించి లోపలి పదార్థాన్ని తిని నాశనం చేస్తుంది. దీని వల్ల కాయల ఆకారం మారిపోయి వంకరగా అవుతాయి. కాయతొలుచు ఈగ నివారణకు పూత దశలో లీటరు నీటికి ఫానలోన్ 2ml కలిపి పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

News January 27, 2026

లోకేశ్ యువగళం పాదయాత్రకు 3 ఏళ్లు

image

AP: నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు నేటితో మూడేళ్లు పూర్తయ్యాయి. 2023 జనవరి 27న కుప్పంలో శ్రీ వరదరాజస్వామి ఆలయం వద్ద ప్రారంభమైన ఈ యాత్ర 226 రోజుల పాటు 3,132 కిలోమీటర్లు సాగింది. ఈ సందర్భంగా లోకేశ్ ట్వీట్ చేశారు. తన పాదయాత్రలో రైతులు, మహిళలు, యువత, కార్మికులు సహా అన్ని వర్గాల సమస్యలను తెలుసుకున్నానని తెలిపారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా తమ విధానాలు ఉంటాయని స్పష్టం చేశారు.