News June 30, 2024
రోజూ మల్టీవిటమన్లతో మరణ ముప్పు పెరుగుతుంది
రోజూ మల్టీవిటమిన్ సప్లిమెంట్లు తీసుకోవడంతో మనుషుల ఆయుష్షు పెరగదని US నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పరిశోధనలో తేలింది. 1990-2010 మధ్య దాదాపు 4లక్షల మందిపై సైంటిస్టులు అధ్యయనం చేశారు. మల్టీవిటమిన్లతో ఆరోగ్యానికి ప్రమాదమని, త్వరగా మరణించే ముప్పు 4% పెరిగిందని గుర్తించారు. సప్లిమెంట్ల కంటే కూరగాయలు, తృణధాన్యాలు లాంటి ఆహారం తీసుకోవడం మంచిదని, మద్యం, మాంసం తగ్గించాలని సూచించారు.
Similar News
News October 12, 2024
BIG ALERT: అతి భారీ వర్షాలు
AP: రాష్ట్రంలో ఎల్లుండి నుంచి మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం ఎల్లుండికి వాయుగుండంగా మారనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. మరుసటి రోజుకు తీవ్ర తుఫానుగా మారి తమిళనాడులో తీరం దాటవచ్చని పేర్కొంది.
News October 12, 2024
ఇవాళ పాలపిట్టను ఎందుకు చూడాలంటే?
దసరా రోజున పాలపిట్టను చూస్తే అదృష్టం, విజయం వరిస్తుందని నమ్మకం. రావణుడిపై శ్రీరాముడు యుద్ధానికి వెళ్లే సమయంలో పాలపిట్టను చూడటంతో విజయం సాధించాడని పురాణ గాథ. పాండవులు అరణ్యవాసం ముగించుకుని ఆయుధాలు తీసుకెళ్తున్నప్పుడు పాలపిట్టను చూడటంతో కౌరవులను గెలిచారని మరోగాథ. ఈ నమ్మకంతో గ్రామాల్లో దసరా రోజున సాయంత్రం ప్రజలు పాలపిట్టను చూసేందుకు పొలాలు, ఊరి చివరకు వెళ్తారు.
News October 12, 2024
జగన్మాతగా దర్శనమిస్తున్న దుర్గమ్మ
AP: దసరా ఉత్సవాల్లో భాగంగా ఇవాళ విజయవాడ దుర్గమ్మ జగన్మాత రాజరాజేశ్వరిదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. నేటితో ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రోత్సవాలు ముగియనున్నాయి. భక్తులను రాత్రి 11 గంటల వరకు ఆలయంలోకి అనుమతించనున్నారు. చివరి రోజు కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు.