News July 2, 2024

రూ.2వేల నోట్లు 97.87% వెనక్కి వచ్చాయ్: RBI

image

కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన రూ.2000 నోట్లలో 97.87శాతం వరకు బ్యాకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చినట్లు ఆర్బీఐ తెలిపింది. 2024 జూన్ 28 నాటికి రూ.7851 కోట్ల విలువైన నోట్లు మాత్రం ప్రజల వద్దే ఉండిపోయాయంది. కాగా 2016 నవంబరులో ఈ నోట్లను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. 2023 మే 19న రూ.2వేల నోట్లను కేంద్రం ఉపసంహరించుకుంది.

Similar News

News September 20, 2024

నన్ను కావాలనే ఇరికించారు: జానీ మాస్టర్

image

లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడి కేసులో జానీ మాస్టర్‌ను పోలీసులు ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపర్చారు. కాగా తాను ఎవరిపైనా ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదని ఆయన అన్నారు. కొందరు కావాలనే తనపై ఆమెతో ఫిర్యాదు చేయించారని ఆరోపించారు. లీగల్‌గా పోరాడి బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు.

News September 20, 2024

లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదు: ఏఆర్ డెయిరీ

image

తిరుమల లడ్డూ వ్యవహారంపై టీటీడీకి నెయ్యి సరఫరా చేసే తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ స్పందించింది. నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని వెల్లడించింది. ఇదే విషయాన్ని టీటీడీకి వివరించినట్లు చెప్పింది. జులైలో 16 టన్నుల నెయ్యి సరఫరా చేశామని వెల్లడించింది.

News September 20, 2024

ఉప్పరపల్లి కోర్టుకు జానీ

image

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను పోలీసులు ఉప్పరపల్లి కోర్టుకు తరలించారు. రాజేంద్రనగర్ సీసీఎస్ నుంచి న్యాయస్థానానికి తీసుకెళ్లారు. ఈ ఉదయం నుంచి జానీని పోలీసులు విచారించారు.