News January 17, 2025

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. 12 మంది భారతీయుల మృతి

image

ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా తరఫున పోరాడుతున్న 12 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారని కేంద్రం తెలిపింది. మరో 16 మంది అదృశ్యమైనట్లు వెల్లడించింది. మొత్తం 126 మంది ఇండియన్స్ యుద్ధంలో పాల్గొనగా 96 మంది సురక్షితంగా ఉన్నట్లు పేర్కొంది. ఇటీవల కేరళకు చెందిన ఓ వ్యక్తి రష్యా తరఫున పోరాడుతూ చనిపోయిన విషయం తెలిసిందే. యుద్ధంలో భారతీయుల మరణాలపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

Similar News

News February 19, 2025

జగన్‌కు ఈసారి ఆ 11 సీట్లు కూడా రావు: కేంద్ర మంత్రి పెమ్మసాని

image

AP: వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్‌కు ఆ 11 సీట్లు కూడా రావని, ఒక్క సీటుకే పరిమితమవుతారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ‘జగన్ భాష, వ్యవహారంతో వైసీపీకి కష్టాలు తప్పవు. ఆయన హయాంలో YCP నేతలతో చేయకూడని పనులు చేయించారు. వాటిపైనే ఇప్పుడు వారిపై కేసులు పెడుతున్నారు. ఇందులో తప్పేముంది? రాష్ట్రం అప్పుల్లో ఉన్నా సీఎం చంద్రబాబు రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటున్నారు’ అని ఆయన పేర్కొన్నారు.

News February 19, 2025

కేంద్రమంత్రికి సీఎం చంద్రబాబు లేఖ

image

AP: మద్దతు ధర లేక ఇబ్బందిపడుతున్న మిర్చి రైతులను ఆదుకోవాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు CM చంద్రబాబు లేఖ రాశారు. రైతులను ఆదుకునేలా చర్యలు చేపట్టాలని కోరారు. మార్కెట్ జోక్యం ద్వారా తగ్గిన ధరను భర్తీ చేసేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. సాగు వ్యవసాయానికి విక్రయ ధర మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలని సూచించారు. 50శాతం నిష్పత్తిలో కాకుండా వందశాతం నష్టం భరించాలని లేఖలో విన్నవించారు.

News February 19, 2025

ఇవాళ అంతర్జాతీయ ‘టగ్ ఆఫ్ వార్’ డే

image

రెండు జట్లు తాడు లాగుతూ పోటీపడే ఆటను టగ్ ఆఫ్ వార్ అంటారు. రెండు జట్ల మధ్య ఒక గీతను గీసి తాడు లాగడంపై పోటీ నిర్వహిస్తారు. ఎనిమిది మంది లేదా అంతకంటే ఎక్కువ మంది ఈ పోటీలో పాల్గొనవచ్చు. ప్రత్యర్థి జట్టును గీత తాకేలా ఎవరైతే లాగుతారో వారే విజేతగా నిలుస్తారు. సరదా కోసం ఆడే ఈ ఆట 1900 నుంచి 1920 వరకు ఒలింపిక్స్‌లో కూడా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ ఆట ఆడుతుంటారు. మీరూ ఎప్పుడైనా ఆడారా?

error: Content is protected !!