News July 2, 2024

కస్టమర్‌కు నష్టపరిహారం చెల్లించండి: AIRTELకు NCDRC ఆదేశం

image

డూప్లికేట్ సిమ్‌ను జారీ చేసినందుకు కస్టమర్‌కు పరిహారం చెల్లించాలని AIRTELను NCDRC ఆదేశించింది. ఓ ఆర్మీ ఉద్యోగి మొబైల్ నంబర్‌పై గుర్తు తెలియని వ్యక్తి మోసపూరితంగా సిమ్ కార్డు పొంది అతని బ్యాంకు అకౌంట్ నుంచి 2017లో ₹2,87,630 డ్రా చేశాడు. దీనిపై కంప్లైంట్ ఇవ్వగా నిందితుడిని గుర్తించడంలో కంపెనీ విఫలమైందని కమిషన్ తేల్చింది. ఫిర్యాదుదారు శ్యామ్ కుమార్‌కు ₹2.8 లక్షలతో పాటు ₹లక్ష పరిహారం చెల్లించాలంది.

Similar News

News April 3, 2026

₹167కోట్లు!.. ఇది దేశంలోనే అత్యంత ఖరీదైన పెయింటింగ్

image

రాజా రవివర్మ పెయింటింగ్స్‌లో ఒకటైన ‘యశోద-కృష్ణ’ వేలంలో ఏకంగా ₹167.20కోట్లు పలికింది. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎండీ సైరస్ పూనావాలా దీనిని దక్కించుకున్నారు. ఎంఎఫ్ హుసేన్ ‘గ్రామ్ యాత్ర’ పెయింటింగ్ రికార్డ్‌ను (₹118Cr) బ్రేక్ చేసి దేశంలోనే ఖరీదైన చిత్రంగా నిలిచింది. ఈ ఆయిల్ పెయింటింగ్‌ను రవివర్మ 1890ల్లో గీశారు. యశోద ఆవు పాలు పితుకుతుంటే బాలకృష్ణుడు పాత్రతో చేయిచాస్తున్నట్టుగా ఈ చిత్రం ఉంది.

News April 3, 2026

ఐపీఎల్ మ్యాచ్‌ల సంఖ్య పెంచడం కష్టమే: అరుణ్ ధుమాల్

image

ఐపీఎల్ మ్యాచ్‌లను పెంచాలన్న డిమాండ్లపై ఛైర్మన్ అరుణ్ ధుమాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. మ్యాచ్‌ల సంఖ్యను 84 లేదా 94కు పెంచడం అనేది అంతర్జాతీయ షెడ్యూల్‌పై ఆధారపడి ఉంటుందన్నారు. ప్రస్తుత విండోలోనే (MAR-MAY) మ్యాచ్‌లు పెంచాలంటే డబుల్ హెడర్స్ ఎక్కువవుతాయని.. ఇది బ్రాడ్‌కాస్టర్లకు అంతగా నచ్చదన్నారు. ద్వైపాక్షిక సిరీస్‌‌లకు డిమాండ్ తగ్గుతున్న నేపథ్యంలో వాటి సంఖ్య తగ్గిస్తే ఐపీఎల్ మ్యాచ్‌లు పెంచుకోవచన్నారు.

News April 3, 2026

రెండేళ్లుగా సింగరేణిలో తగ్గుతున్న బొగ్గు ఉత్పత్తి

image

TG: గత రెండేళ్లుగా సింగరేణి బొగ్గు ఉత్పత్తి తగ్గుతోంది. 2025-26లో 72 మెట్రిక్ టన్నులు లక్ష్యంగా పెట్టుకోగా ఉత్పత్తి 58MTకే పరిమితమైంది. అంతకముందు ఏడాదితో పోలిస్తే ఇది 16% తక్కువ. FY25లోనూ 72MT టార్గెట్ అయితే 69MTనే ఉత్పత్తి చేసింది. భారీ వర్షాలు, మార్కెట్‌లో లో గ్రేడ్ బొగ్గుకు డిమాండ్ తగ్గడం, సంస్థ బొగ్గు ధరలను పెంచడం, కొత్త గనుల మంజూరులో జాప్యం ఉత్పత్తి తగ్గడానికి కారణాలుగా తెలుస్తోంది.