News July 3, 2024
చంద్రబాబు కీలక నిర్ణయం

AP: శాఖలపై గతంలో గంటల పాటు సమీక్షలు నిర్వహించే CM చంద్రబాబు రూట్ మార్చారు. ఏ శాఖతో రివ్యూ అయినా 30 నిమిషాల్లోనే ముగించాలని ఉన్నతాధికారులకు సూచించారట. ఇసుక, రహదారులు, నిత్యావసరాలపై నిన్న సమీక్షించిన CM.. ఒక్కో శాఖకు 30 నిమిషాలే కేటాయించారు. అధికారులు ఏం చెప్పాలనుకున్నా 20 నిమిషాల్లోనే ముగించమని ఆదేశించారట. కందిపప్పుల ధరలు పెరగడాన్ని CM దృష్టికి తీసుకెళ్లగా, కేంద్రంతో మాట్లాడుతామని బదులిచ్చారు.
Similar News
News March 12, 2026
కాకినాడ ఆదిత్య యూనివర్సిటీలో ఫ్యాకల్టీ పోస్టులు

కాకినాడ జిల్లా సూరంపాలెంలోని ఆదిత్య యూనివర్సిటీలో ECE, CSE, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ తదితర విభాగాల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. చివరితేదీ: మార్చి 15, వెబ్సైట్: <
News March 12, 2026
UPSCపై వివాదం.. ఇంటర్వ్యూలో పక్షపాతం?

UPSC సివిల్స్లో రిజర్వ్డ్ క్యాండిడేట్స్కు అన్యాయం జరుగుతోందంటూ SMలో చర్చ జరుగుతోంది. మెయిన్స్లో మంచి మార్కులు సాధించినా.. ఇంటర్వ్యూలో తక్కువ స్కోర్ వస్తున్నట్లు ఓ వర్గం ఆరోపిస్తోంది. ఇది ఇంటర్వ్యూ బోర్డు పక్షపాతం వల్లే అంటోంది. మెయిన్స్లో టాప్ మార్కులు వచ్చిన ఓ రిజర్వ్డ్ క్యాండిడేట్కు ఇంటర్వ్యూలో 60/275 మార్కులే వచ్చినట్లు ఉదహరిస్తోంది. దీన్ని మరో వర్గం మాత్రం కొట్టిపారేస్తోంది.
News March 12, 2026
పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లు.. ఉత్తర్వులు జారీ

AP: సర్పంచ్ల పదవీ కాలం APR 2తో ముగియనుంది. దీంతో గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారులను నియమించాలని కలెక్టర్లను ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. MRO, MPDO, MEO, డిప్యూటీ MPDO, వీరి కంటే ఎక్కువ హోదా కలిగిన వారిని స్పెషల్ ఆఫీసర్లుగా నియమించాలని సూచించింది. కొత్త సర్పంచ్లు బాధ్యతలు చేపట్టేవరకు వీరు పాలన కొనసాగించాలంది. రాష్ట్రంలో 13,100 గ్రామ పంచాయతీలు ఉన్న విషయం తెలిసిందే.


