News July 3, 2024
3 నెలల్లో 1.28 లక్షల ఇళ్లు నిర్మిస్తాం: మంత్రి పార్థసారథి

AP: వచ్చే 3 నెలల్లో 1.28 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. ఇందుకోసం రూ.2,520 కోట్లను ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న 8.02 లక్షల గృహాలను వచ్చే మార్చి నెలాఖరుకు పూర్తి చేస్తామన్నారు. అర్హులందరికీ ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం దృఢసంకల్పంతో ఉందని, అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని ఆదేశించారు.
Similar News
News February 5, 2026
మేళ్లచెర్వు జాతరకు రూ.కోటి మంజూరు

ప్రముఖ పుణ్యక్షేత్రమైన మేళ్లచెరువు స్వయంభూ శంభులింగేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధికి మంత్రి ఉత్తమ్ రూ.1 కోటి నిధులను మంజూరు చేశారు. రాబోయే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, భక్తులకు అవసరమైన వసతుల కల్పన కోసం ఈ నిధులను వెచ్చించనున్నారు. ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపిన మంత్రికి ఆలయ సిబ్బంది, గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ జాతర ఈ నెల 15 నుంచి జరగనుంది.
News February 5, 2026
AI ఎఫెక్ట్.. ఉద్యోగం కోల్పోయిన శశిథరూర్ కుమారుడు

అమెరికా మీడియా సంస్థ ‘వాషింగ్టన్ పోస్ట్’ తమ సిబ్బందిలో మూడింట ఒక వంతు మందిని (300+) ఉద్యోగాల నుంచి తొలగించింది. ఇందులో కాంగ్రెస్ MP శశిథరూర్ తనయుడు ఇషాన్ కూడా ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన SMలో వెల్లడించారు. ‘నాతో పాటు చాలా మంది ఇంటర్నేషనల్ స్టాఫ్ను తొలగించారు. మా ఖాళీ న్యూస్ రూమ్ను, జర్నలిస్టులను చూస్తుంటే బాధగా ఉంది’ అని పేర్కొన్నారు. AI వల్ల ITతో పాటు ఇతర రంగాల్లో లేఆఫ్స్ కొనసాగుతున్నాయి.
News February 5, 2026
బంధంలో ఇది ముఖ్యం

అన్యోన్యంగా జీవితాన్ని సాగించాలనుకునే దంపతులు పట్టు విడుపులు సమానంగా పాటించాలి. అంతేగానీ బంధాన్ని నిలబెట్టుకోవాలన్న తాపత్రయంతోనో, నలుగురూ వేలెత్తి చూపుతారన్న భయంతోనో నిరంతరం అవతలి వారి తప్పులను క్షమిస్తూ పోతే మీ జీవితాన్ని మీరే పాడుచేసుకున్న వారవుతారు. కాబట్టి బంధమేదైనా అన్ని రకాలుగా బ్యాలన్స్డ్గా ఉంటేనే కలకాలం నిలుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.


