News July 4, 2024
వరల్డ్ కప్ విజేతలతో ప్రధానులు

టీ20 వరల్డ్ కప్-2024లో గెలిచి విశ్వవిజేతలుగా నిలిచిన భారత జట్టును ప్రధాని నరేంద్ర మోదీ అభినందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత వరల్డ్ కప్ విజేతలతో అప్పటి ప్రధానులు దిగిన ఫొటోలు వైరలవుతున్నాయి. 1983లో తొలి ODI వరల్డ్ కప్ గెలిచిన జట్టుతో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఫొటో దిగారు. 2007లో T20 WC గెలిచిన ధోనీ సారథ్యంలోని భారత జట్టు గత ప్రధాని మన్మోహన్ సింగ్తో కలిసి కెమెరాకు పోజులిచ్చింది.
Similar News
News November 12, 2025
రిగ్గింగ్ చేయడం పాజిబుల్ కాదు: PCC చీఫ్

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ రిగ్గింగ్కు పాల్పడిందన్న BRS ఆరోపణలను పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తిప్పికొట్టారు. ‘రిగ్గింగ్ చేయడం పాజిబుల్ కాదు. ఇది పాత జమానా కాదు. BRS వాళ్లు ఓడిపోతున్నామనే బాధలో మాట్లాడుతున్నారు. మళ్లీ మేమే వస్తాం. హైకోర్టు ఆదేశాల మేరకు స్థానిక ఎన్నికలపై ముందుకు వెళ్తాం. క్యాబినెట్ విస్తరణ సీఎం, అధిష్ఠానం చూసుకుంటుంది’ అని మీడియాతో చిట్చాట్లో తెలిపారు.
News November 12, 2025
కొబ్బరి చెట్లకు నీటిని ఇలా అందిస్తే మేలు

కొబ్బరి తోటల్లో నేల తేమ ఆరకుండా, భూమి స్వభావాన్ని, వాతావరణాన్ని బట్టి నీటిని సక్రమంగా అందించాలి. డెల్టా ప్రాంతాల్లో నీటిని తోటలలో పారించే పద్ధతిని అనుసరిస్తున్నారు. అయితే ఈ పద్ధతిలో సేద్యపు నీరు ఎక్కువగా వృథా అయ్యి తెగుళ్లు కూడా తొందరగా ఇతర మొక్కలకు వ్యాపించే అవకాశం ఉంది. చెట్ల చుట్టూ పళ్లెం చేసి బేసిన్ పద్ధతి ద్వారా లేదా డ్రిప్ విధానంలో తోటలకు నీటిని అందించడం వల్ల నీటి వృథాను అరికట్టవచ్చు.
News November 12, 2025
‘పెద్ది’ సినిమాలో సీనియర్ నటి?

రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘పెద్ది’లో సీనియర్ నటి శోభన కీలకపాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. డైరెక్టర్ బుచ్చిబాబు ఆమెను సంప్రదించినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో జాన్వీకపూర్ హీరోయిన్గా కనిపించనున్నారు. జగపతిబాబు, శివరాజ్కుమార్, దివ్యేందు శర్మ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.


