News July 4, 2024

వరల్డ్ కప్ విజేతలతో ప్రధానులు

image

టీ20 వరల్డ్ కప్‌-2024లో గెలిచి విశ్వవిజేతలుగా నిలిచిన భారత జట్టును ప్రధాని నరేంద్ర మోదీ అభినందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత వరల్డ్ కప్‌ విజేతలతో అప్పటి ప్రధానులు దిగిన ఫొటోలు వైరలవుతున్నాయి. 1983లో తొలి ODI వరల్డ్ కప్ గెలిచిన జట్టుతో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఫొటో దిగారు. 2007లో T20 WC గెలిచిన ధోనీ సారథ్యంలోని భారత జట్టు గత ప్రధాని మన్మోహన్ సింగ్‌తో కలిసి కెమెరాకు పోజులిచ్చింది.

Similar News

News December 13, 2025

టుడే టాప్ స్టోరీస్

image

*విశాఖలో 9 IT సంస్థలకు CM చంద్రబాబు, లోకేశ్ శంకుస్థాపన
*ఉత్తరాంధ్రలోని పలు ప్రాజెక్టుల పురోగతిపై CM CBN ఏరియల్ సర్వే
*మూవీ టికెట్ రేట్ల పెంపు కోసం రాకండి: మంత్రి కోమటిరెడ్డి
*ఇంటి అల్లుడి ఫోన్ ట్యాప్ చేశారు.. సిగ్గుండాలి: కవిత
*మూడ్రోజుల్లో రూ.3,760 పెరిగిన బంగారం
*ఉపాధి హామీ పేరును ‘పూజ్య బాపు గ్రామీణ ఉపాధి హామీ పథకం’గా మార్పు
*ఎప్‌స్టీన్ ఫైల్స్.. ట్రంప్, క్లింటన్, బిల్‌గేట్స్ ఫొటోలు

News December 13, 2025

అనుకోని అతిథి ఎందుకొచ్చారు?

image

యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ తెలంగాణ పర్యటన ఆసక్తికరంగా మారింది. వచ్చీ రావడంతోనే <<18545632>>CM రేవంత్ రెడ్డి<<>>తో, ఆ వెంటనే BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRతోనూ సమావేశం అయ్యారు. త్వరలోనే అఖిలేశ్ KCRను కలుస్తారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. దీంతో BJPకి వ్యతిరేకంగా మరో కూటమి ఏర్పాటు చేస్తున్నారా అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. విభజన రాజకీయాలు అంతం కావాలని అఖిలేశ్ చెప్పడంతో కూటమి ప్రయత్నాలే అంటూ చర్చ మొదలైంది.

News December 12, 2025

ఎప్‌స్టీన్ ఫైల్స్.. ట్రంప్‌, క్లింటన్‌, బిల్‌ గేట్స్ ఫొటోలు

image

అమెరికా లైంగిక నేరగాడు జెఫ్రీ <<18464497>>ఎప్‌స్టీన్ ఎస్టేట్<<>> నుంచి సేకరించిన సంచలన ఫొటోలను హౌస్‌ ఓవర్‌సైట్ కమిటీ విడుదల చేసింది. ఇందులో డొనాల్డ్‌ ట్రంప్‌, బిల్‌ క్లింటన్‌, బిల్‌ గేట్స్‌ సహా పలువురు ప్రముఖులు ఉన్నారు. అయితే ఈ ఫొటోలలో ఎవరూ చట్టవిరుద్ధమైన కార్యకలాపాలలో పాల్గొనే విధంగా లేరని కమిటీ స్పష్టం చేసింది. కాగా <<18336928>>ఎప్‌స్టీన్ ఫైళ్ల<<>> విడుదలకు ఇటీవల ట్రంప్ ఓకే చెప్పగా ఇప్పుడు ఆయన ఫొటోలే బయటకు రావడం గమనార్హం.