News July 5, 2024

అమరావతికి రానున్న ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ

image

AP: దేశంలోనే ప్రముఖ బిజినెస్ స్కూళ్లలో ఒకటైన XLRI అమరావతిలో తమ క్యాంపస్ నెలకొల్పనుంది. ఈ సంస్థకు గతంలో 50 ఎకరాలను చంద్రబాబు కేటాయించారు. ప్రభుత్వం మారిన తర్వాత ఈ సంస్థ వెనక్కి తగ్గింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం మళ్లీ సంప్రదింపులు జరపడంతో రూ.250 కోట్లతో క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. నిర్మాణం పూర్తైతే 5వేల మంది రాష్ట్ర, దేశ, విదేశీ విద్యార్థులు UG, PG కోర్సుల్లో విద్యను అభ్యసించొచ్చు.

Similar News

News October 6, 2024

ఈ జిల్లాల్లో వర్షాలు

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నారాయణపేట, వనపర్తి, వికారాబాద్, సంగారెడ్డి, జనగాం, మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లో వానలు పడుతున్నాయి. హైదరాబాద్ నగరంలోనూ మధ్యాహ్నం, రాత్రి వేళల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్‌మ్యాన్ తెలిపారు.

News October 6, 2024

ఇంటిపనులు చేసిన దొంగ.. చివరికి ఏమైందంటే!

image

దొంగలు పలు రకాలు! ఇంట్లోవాళ్లను చంపిమరీ దోచుకెళ్లే వారు కొందరు. బట్టలు ఉతికి, మొక్కలకు నీళ్లుపోసి, ఫ్లోర్ తుడిచి, ఇల్లు సర్ది, వంటచేసి, భోజనం తిని ‘ఫీల్ ఎట్ హోమ్’ అన్నట్టుగా ప్రవర్తించేవారు ఇంకొందరు. UKలో వోజ్నిలోవిక్ ఇదే కోవకు చెందుతాడు. ఓ మహిళ ఇంట్లోకి చొరబడి వైన్ తాగి ‘డోన్ట్ వర్రీ, బీ హ్యాపీ, బాగా తినండి’ అని రాసిపెట్టాడు. మరో ఇంటికెళ్లి పట్టుబడ్డాడు. కోర్టు అతడికి 22 నెలల జైలుశిక్ష వేసింది.

News October 6, 2024

ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు: భట్టి

image

TG: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రపంచస్థాయిలో తీర్చిదిద్దుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఉచితంగా నాణ్యమైన విద్య కోసం ప్రతి నియోజకవర్గంలో ఈ స్కూళ్లను కట్టాలని నిర్ణయించామన్నారు. దసరా కంటే ముందే వీటికి భూమిపూజ చేస్తామని చెప్పారు. ప్రస్తుతం 1023 రెసిడెన్షియల్ స్కూళ్లు ఉంటే 600కు పైగా పాఠశాలలకు సొంత భవనాలు లేవని భట్టి తెలిపారు.