News July 6, 2024

టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో మరో ముగ్గురు అరెస్ట్

image

TDP కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో జింకా సత్యం, లంకా అబ్బినాయుడు, తియ్యగూర గోపిరెడ్డి అనే ముగ్గురిని మంగళగిరి పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. 2021 అక్టోబర్ 19న ఈ ఘటన జరగగా, ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య 8కి చేరింది. ఇటీవల 4 పోలీస్ బృందాలు విచారణ జరిపి నిందితులను గుర్తించాయి. వారిలో గుంటూరుకు చెందిన YCP కార్యకర్తలే ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారించాయి. కాగా పలువురు నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం.

Similar News

News March 21, 2026

అమెరికాకు ‘క్విడ్ ప్రోకో’ ప్రతిపాదన చేయలేదు: రష్యా

image

ఉక్రెయిన్‌కు మద్దతును అమెరికా ఉపసంహరించుకుంటే తాము ఇరాన్‌కు ఇంటెలిజెన్స్ సాయాన్ని నిలిపివేస్తామని రష్యా ఆఫర్ ఇచ్చినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. వీటిని రష్యా ఖండించింది. అమెరికాతో ఎలాంటి క్విడ్ ప్రోకో ప్రతిపాదన జరగలేదని, ఇవన్నీ ఫేక్ వార్తలని స్పష్టం చేసింది. పుతిన్ రాయబారి కిరిల్ దిమిత్రీవ్ ఈ ఐడియాను ప్రతిపాదించినట్లు నివేదికలు పేర్కొనగా, ఆయన దీనిని X వేదికగా ఖండించారు.

News March 21, 2026

ఆడియన్స్ సీట్లకు అతుక్కుపోయారు: రాజమౌళి

image

‘ధురంధర్-2’ 4 గంటల నిడివి ఉన్నా ఆడియన్స్ లాస్ట్ ఫ్రేమ్ వరకు సీట్లకు అతుక్కుపోయారని డైరెక్టర్ రాజమౌళి అన్నారు. ఇంతటి లెన్త్ ఉన్న మూవీని రిలీజ్ చేయడానికి గట్స్ ఉండాలని చెప్పారు. తనకు ధురంధర్ నచ్చిందని, ధురంధర్-2 అంతకంటే బాగుందని కొనియాడారు. రైటింగ్, కాస్టింగ్, మ్యూజిక్, డైరెక్షన్ ఇలా అన్ని విభాగాల్లో మూవీ అద్భుతంగా ఉందని ట్వీట్ చేశారు. రణ్‌వీర్, మాధవన్ నటనలో మాస్టర్ క్లాస్ చూపించారన్నారు.

News March 21, 2026

పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్ సీజ్

image

TG: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. పార్టీకి ఉపయోగించిన ఫామ్‌హౌస్‌ను పోలీసులు సీజ్ చేశారు. అసైన్డ్ భూమిలో దాన్ని కట్టారని అధికారులు తేల్చగా, పోలీసులు చర్యలు తీసుకున్నారు. మరోవైపు పార్టీకి వచ్చినవారి వాహనాలనూ సీజ్ చేశారు.