News July 6, 2024

టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో మరో ముగ్గురు అరెస్ట్

image

TDP కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో జింకా సత్యం, లంకా అబ్బినాయుడు, తియ్యగూర గోపిరెడ్డి అనే ముగ్గురిని మంగళగిరి పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. 2021 అక్టోబర్ 19న ఈ ఘటన జరగగా, ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య 8కి చేరింది. ఇటీవల 4 పోలీస్ బృందాలు విచారణ జరిపి నిందితులను గుర్తించాయి. వారిలో గుంటూరుకు చెందిన YCP కార్యకర్తలే ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారించాయి. కాగా పలువురు నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం.

Similar News

News October 14, 2024

ప్రముఖ కమెడియన్ కన్నుమూత

image

హాస్యనటుడు, ‘ది కపిల్ శర్మ’ షో ఫేమ్ అతుల్ పర్చురే(57) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. పలు మరాఠీ సీరియళ్లు, హిందీ సినిమాలు, టీవీ షోల్లో ఆయన ప్రేక్షకులను అలరించారు. తెలుగులో గత ఏడాది విడుదలైన ‘రూల్స్ రంజన్’ సినిమాలోనూ ఆయన నటించారు.

News October 14, 2024

ఈ జిల్లాలపై తుఫాను ప్రభావం ఎక్కువ: మంత్రి నారాయణ

image

AP: చెన్నై-నెల్లూరు మధ్య ఈనెల 17న తుఫాను తీరం దాటే అవకాశముందని వాతావరణశాఖ వెల్లడించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. తుఫాను పరిస్థితులు, ముందస్తు జాగ్రత్తలపై అధికారులతో సమీక్షించారు. అన్నమయ్య, కడప, ప్రకాశం, బాపట్ల, నెల్లూరు, TRPT, చిత్తూరు, శ్రీసత్యసాయి జిల్లాల్లో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో ఆయా జిల్లాల అధికారులను అప్రమత్తం చేశామన్నారు. అధికారులు ఇచ్చే సూచనలను ప్రజలు పాటించాలని కోరారు.

News October 14, 2024

నటి కారుకు యాక్సిడెంట్‌.. తీవ్ర గాయాలు

image

బుల్లితెర నటి శ్రీవాణి ప్రయాణిస్తోన్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆమె నుదుటి మీద తీవ్ర గాయం కావడంతో పాటు చెయ్యి ఫ్రాక్చర్ అయ్యింది. ప్రస్తుతం గుంటూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆమె భర్త విక్రమాదిత్య వెల్లడించారు. 3రోజుల క్రితం కుటుంబంతో కలిసి చీరాల బీచ్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. శ్రీవాణి పలు సీరియల్స్‌, టీవీ షోల్లోనూ ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తుంటారు.