News July 9, 2024
PMAY డబ్బు తీసుకొని.. లవర్స్తో వెళ్లిపోయిన 11మంది మహిళలు!

ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మొదటి విడతగా రూ.40వేలు అందుకున్న 11మంది వివాహితలు భర్తలను వదిలేసి తమ లవర్స్తో వెళ్లిపోయారట.
UPలోని మహారాజ్గంజ్ జిల్లాలో జరిగిందీ ఘటన. సదరు భర్తలు పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇవ్వడంతో ఈ వ్యవహారం బయటికి వచ్చిందట. దీంతో 2వ విడత డబ్బును అధికారులు నిలిపివేసినట్లు సమాచారం. గతేడాదీ ఇలాగే రూ.50వేలు తీసుకొని నలుగురు మహిళలు లవర్స్తో పరారయ్యారు.
Similar News
News December 28, 2025
నుమాయిష్ ఎగ్జిబిషన్ ఎప్పటినుంచంటే?

TG: 85వ ఆలిండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్(నుమాయిష్) 2026 వివరాలను మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. జనవరి 1న ప్రారంభమై FEB 15 వరకు కొనసాగనుందని చెప్పారు. ఇన్నోవేషన్, ట్రెడిషన్తోపాటు సరసమైన ధరలకే అన్నీ వస్తువులు దొరుకుతాయన్నారు. ఈసారి సేఫ్టీ, యాక్సెసబిలిటీ, మహిళా వ్యాపారస్థుల కోసం ప్రత్యేక అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. నుమాయిష్ తప్పక సందర్శించాల్సిన సంప్రదాయంగా మారిపోయిందని ట్వీట్ చేశారు.
News December 28, 2025
కర్ణాటక రాజకీయాల్లో KC చిచ్చు.. BJP ఫైర్

బెంగళూరులో అక్రమ కట్టడాల కూల్చివేత కర్ణాటకలో రాజకీయ దుమారం రేపింది. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ నేత KC వేణుగోపాల్ జోక్యం చేసుకోవడంపై BJP మండిపడింది. ఆయన్ను ‘సూపర్ CM’గా అభివర్ణిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఢిల్లీ ఆదేశాలతో నడుస్తోందని విమర్శించింది. రాష్ట్ర పాలనలో జోక్యం చేసుకోవడం సమాఖ్య వ్యవస్థను అవమానించడమేనని ప్రతిపక్ష నేత అశోక ధ్వజమెత్తారు.
News December 28, 2025
Op సిందూర్ టైమ్లో బంకర్లోకి వెళ్లమన్నారు: పాక్ అధ్యక్షుడు

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’తో పాక్ అగ్రనాయకత్వం భయాందోళనకు గురైందని అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ అంగీకరించారు. ఆ సమయంలో ప్రాణరక్షణ కోసం బంకర్లోకి వెళ్లాలని సైనిక కార్యదర్శి తనకు సూచించారని వెల్లడించారు. అందుకు తాను నిరాకరించినట్లు తెలిపారు. కాగా భారత క్షిపణుల ధాటికి పాక్ బెంబేలెత్తిపోయిందనే విషయం దీని ద్వారా స్పష్టమైంది.


