News July 9, 2024
PMAY డబ్బు తీసుకొని.. లవర్స్తో వెళ్లిపోయిన 11మంది మహిళలు!
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మొదటి విడతగా రూ.40వేలు అందుకున్న 11మంది వివాహితలు భర్తలను వదిలేసి తమ లవర్స్తో వెళ్లిపోయారట.
UPలోని మహారాజ్గంజ్ జిల్లాలో జరిగిందీ ఘటన. సదరు భర్తలు పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇవ్వడంతో ఈ వ్యవహారం బయటికి వచ్చిందట. దీంతో 2వ విడత డబ్బును అధికారులు నిలిపివేసినట్లు సమాచారం. గతేడాదీ ఇలాగే రూ.50వేలు తీసుకొని నలుగురు మహిళలు లవర్స్తో పరారయ్యారు.
Similar News
News October 15, 2024
పవన్ కళ్యాణ్కు సీఎం చంద్రబాబు అభినందనలు
AP: ‘పల్లె పండుగ’ కార్యక్రమం విజయవంతంగా సాగుతుండటం ఆనందం కలిగిస్తోందని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. 13,326 గ్రామాలలో రూ.4,500 కోట్ల ఖర్చుతో 30 వేల అభివృద్ధి పనులు చేపట్టాలనే సంకల్పాన్ని డిప్యూటీ సీఎం పవన్ కార్యరూపంలోకి తీసుకువచ్చారని కొనియాడారు. ఇందుకు ఆయనకు అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేపట్టి పల్లెల్లో సంతోషాలు నింపేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
News October 15, 2024
రేపు బీఆర్ఎస్ కీలక భేటీ!
TG: హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు కీలక సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. GHMC పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో రేపు ఉదయం 10 గంటలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ కానున్నారని సమాచారం. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించే అవకాశముంది. కాగా చెరువుల సమగ్ర సర్వే చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం కూల్చివేతలకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చింది.
News October 15, 2024
వయనాడ్.. ప్రియాంకా గాంధీ పోటీ చేసేనా?
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాలకే పరిమితమైన ప్రియాంకా గాంధీ పోటీ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రాహుల్ గాంధీ రాజీనామాతో NOV 13న వయనాడ్(కేరళ) పార్లమెంట్కు <<14363811>>బైపోల్<<>> జరగనుండగా, ఇక్కడ ఆమె బరిలో దిగే ఛాన్స్ ఉంది. INC చీఫ్ ఖర్గే, సీనియర్ నేతలు ఆమె పోటీ చేస్తారని పలుమార్లు ప్రకటించారు. అయితే ప్రియాంక స్పందించలేదు. ఒకవేళ ఆమె పోటీ చేసి గెలిస్తే ఆ సెగ్మెంట్లో గెలిచిన తొలి మహిళా ఎంపీగా చరిత్ర సృష్టించనున్నారు.