News July 10, 2024
పీసీబీ దస్త్రాల దహనంపై పోలీసుల విచారణ

AP: కృష్ణా జిల్లా పెనమలూరులో పీసీబీ దస్త్రాల దహనం కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. విజయవాడ పీసీబీ ప్రధాన కార్యాలయంలో 7 విభాగాల అధికారులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కార్యాలయం నుంచి ఫైల్స్, హార్డ్ డిస్క్లు బయటకు వెళ్లడంలో అధికారుల పాత్రపై విచారిస్తున్నారు. కాల్చిన దస్త్రాల్లోని అంశాలు, వాటి ప్రాధాన్యతపై ఆరా తీస్తున్నారు. సిబ్బంది ఇస్తున్న సమాచారాన్ని వాంగ్మూలంగా నమోదు చేస్తున్నారు.
Similar News
News October 31, 2025
సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్యోగాలు

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్ 19 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబర్ 15 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: www.curaj.ac.in
News October 31, 2025
చూడి పశువులు ఈనేముందు వసతి జాగ్రత్తలు

చూడి పశువును ఈనడానికి 15 రోజుల ముందు దూడ వేసే స్థలానికి మార్చాలి. నేలకు, మేతతొట్టెకు, పక్క గోడలకు సున్నం పూసి శుభ్రంగా ఉంచాలి. దీని వల్ల పశువులు ఈనే సమయంలో, మావి పడిపోయే సమయంలో గర్భాశయానికి రోగకారక క్రిములు చేరకుండా రక్షణ కలుగుతుంది. మేత తొట్టె నుంచి, మురుగు కాలువ వరకు నేల ఒక అంగుళం ఏటవాలుగా ఉండేట్టు చూసుకోవాలి. పశువులకు ఎండుగడ్డినే నేలపై పరిచి పరుపుగా వాడాలి. వరి పొట్టు, రంపం పొట్టు వాడొద్దు.
News October 31, 2025
‘ఓం నమఃశివాయ’ మంత్రం గొప్పదనం

జపం ఉద్దేశం జన్మబంధాన్ని తొలగించడం. శివ భక్తులు ఓంకారంతో కలిపిన ‘ఓం నమః శివాయ’ అనే పంచాక్షరీ మంత్రాన్ని నిరంతరం జపించాలి. ఈ జపానికి మాఘ, భాద్రపద మాసాలు అత్యంత శ్రేష్ఠమైనవి. జపం చేసే సాధకుడు నియమబద్ధుడై, ఓపూట మాత్రమే ఆహారం తీసుకుంటూ, తక్కువగా మాట్లాడాలి. అలాగే, మనస్సును అదుపులో ఉంచుకునే గుణాలు కలిగి ఉండాలి. ఇలాంటి నియమాలు పాటించే శివ భక్తులు కల్పాంతం వరకు శివలోకంలో శాశ్వతంగా నివసిస్తారు. <<-se>>#SIVOHAM<<>>


