News July 13, 2024
రాజకీయ కుట్రలకు అధికారులు బాధితులు: RSP

రఘురామకృష్ణ రాజును వేధించారనే ఆరోపణలతో ఏపీ మాజీ CM జగన్, సీనియర్ IPS అధికారులు సునీల్ కుమార్, అంజనేయులుపై FIR నమోదవ్వడం షాక్కు గురిచేసిందని RSP ట్వీట్ చేశారు. దేశంలో రాజకీయ కుట్రలకు నిజాయితీ గల అధికారులు బాధితులు అవుతున్నారన్నారు. గోధ్రా మారణహోమంలో న్యాయం వైపు నిలిచిన సంజీవ్ భట్ ఏళ్లుగా జైళ్లోనే ఉన్నారని గుర్తుచేశారు. సీనియర్ అధికారులపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Similar News
News January 29, 2026
రైల్వేలో 312 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

రైల్వే ఐసోలేటెడ్ కేటగిరీలో 312 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఇంటర్, డిగ్రీ, LLB, MBA, డిప్లొమా, PG(హిందీ, ఇంగ్లిష్, సైకాలజీ) అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. CBT(1, 2), స్కిల్ టెస్ట్, DV, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.19,900-రూ.44,900 వరకు చెల్లిస్తారు. సైట్: www.rrbcdg.gov.in/
News January 29, 2026
UGC రూల్స్పై సుప్రీం స్టే

UGC ప్రవేశపెట్టిన కొత్త రూల్స్పై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి విచారణ వరకు 2012 రూల్స్ అమలులో ఉంటాయని తెలిపింది. యూజీసీ కొత్తగా ప్రవేశపెట్టిన రూల్స్ అస్పష్టంగా ఉన్నాయని, దుర్వినియోగం చేసే ఛాన్స్ ఉందని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు. కేంద్రానికి నోటీసులు జారీ చేసిన CJI విచారణను మార్చి 19కి వాయిదా వేశారు.
News January 29, 2026
కేసీఆర్కు సిట్ నోటీసులు.. రేపు 3pmకు విచారణ

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో KCRకు సిట్ నోటీసులిచ్చింది. HYD నందినగర్లోని ఆయన ఇంటికి వెళ్లిన సిట్ అధికారులు CRPC 160 కింద మాజీ సీఎం పీఏకు నోటీసులు అందించారు. రేపు 3pmకు విచారణకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. 65సం.లకు పైగా వయస్సు ఉండటంతో స్టేషన్కు రావడం తప్పనిసరి కాదని తెలిపారు. PSకు రావాలి అనుకుంటే రావచ్చు, లేదా HYD పరిధిలో ఆయన కోరిన చోట విచారణ చేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు.


