News July 17, 2024
కాసేపట్లో వర్షం

తెలంగాణలోని పలు జిల్లాల్లో మరో 3 గంటల్లో వర్షం కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హన్మకొండ, వరంగల్, సిరిసిల్ల, ములుగు, మంచిర్యాల, ఖమ్మం, అసిఫాబాద్, మహబూబాబాద్, కరీంనగర్, భూపాలపల్లి, జనగామ, జగిత్యాల, కొత్తగూడెం, ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో వాన పడనున్నట్లు పేర్కొంది. కాగా రాష్ట్రంలో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
Similar News
News January 13, 2026
ముంబైలో నయా దందా.. 30 వేలకే భారత పౌరసత్వం?

ముంబైలో అక్రమ వలసదారులపై NDTV కథనం కలకలం రేపుతోంది. బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి వచ్చిన వారికి కేవలం రూ.7 వేల నుంచి రూ.30 వేలకే బర్త్ సర్టిఫికెట్, ఆధార్, ఓటర్ ఐడీ, పాన్ కార్డు వంటి నకిలీ పత్రాలు అందుతున్నట్లు వెల్లడించింది. 61 ప్రాంతాల్లో 3,014 మందిని పరిశీలించగా వీరిలో 96% అక్రమంగా భారత్లోకి వచ్చిన ముస్లింలేనని తెలిపింది. ‘మాల్వాణి ప్యాటర్న్’ పేరుతో వీరంతా ఓటు బ్యాంకులుగా మారుతున్నారని పేర్కొంది.
News January 13, 2026
మిగిలిన భోగి పళ్లను ఏం చేయాలి?

భోగి పళ్లు పోసిన తర్వాత కింద పడిన పళ్లను పిల్లలు ఏరుకుంటారు. ఆ తర్వాత మిగిలిపోయిన పళ్లను బయట పడేయకూడదు. వాటిని శుభ్రం గోమాతలకు పెట్టడం వల్ల శుభం కలుగుతుంది. ఇతర మూగజీవాలకు ఆహారంగా వేయడం కూడా చాలా మంచిది. ఇలా చేస్తే పళ్లు వృధా కాకుండా ఉండటమే కాకుండా, పశువులకు ఆహారం పెట్టిన పుణ్యం కూడా దక్కుతుంది. ప్రకృతితో ముడిపడి ఉన్న మన సంప్రదాయాల్లో జీవ కారుణ్యం కూడా భాగమని చెప్పడానికి ఇదో నిదర్శనం.
News January 13, 2026
షాక్స్గామ్ వ్యాలీపై కన్నేసిన చైనా

జమ్ము కశ్మీర్లోని షాక్స్గామ్ వ్యాలీ ప్రాంతాన్ని తమ భూభాగం అంటూ చైనా మరోసారి ప్రకటించుకుంది. ఇప్పటికే ఆ ప్రాంతం మీదుగా రోడ్డు నిర్మాణాన్ని చేపట్టింది. చైనా చర్యను పలుమార్లు భారత్ ఖండించింది. అయితే షాక్స్గామ్ ప్రాంతం తమ భూభాగమేనని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ మీడియా సమావేశంలో తెలిపారు. కాగా 1963లో పాక్ అక్రమంగా 5,180 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనాకు కట్టబెట్టింది.


