News July 17, 2024

సంగారెడ్డి: ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదని దాడి.. తండ్రి మృతి

image

ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదనే కోపంతో కన్న తండ్రిని కొడుకు హత్య చేసినట్లు కంగ్టి ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు. మండలంలోని చౌకన్పల్లికి చెందిన మారుతిని తన కొడుకు నరసప్ప డబ్బులు అవసరమని మంగళవారం అడిగాడు. దీనికి తండ్రి నిరాకరించడంతో కోపోద్రిక్తుడై నరసప్ప ఆవేశంతో గొడ్డలితో తండ్రిపై దాడి చేశారు. మారుతికి చికిత్స కోసం సంగారెడ్డి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Similar News

News January 12, 2026

మెదక్: ‘ఇంటిగ్రేటెడ్ స్కూల్ త్వరితగతిన పూర్తి చేయాలి’

image

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ విద్యాసంస్థల నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని మెదక్ కలెక్టర్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. స్థల సేకరణ, నిర్మాణ పనులు, తదితర అంశాలపై సమీక్షించారు. అదనపు కలెక్టర్ నగేశ్, జిల్లా విద్యాధికారి విజయ, జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

News January 12, 2026

మెదక్: ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి: అదనపు కలెక్టర్

image

కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సమస్యల పరిష్కారానికి సమర్థంగా ఉపయోగించుకోవాలని అదనపు కలెక్టర్ నగేశ్ తెలిపారు. సమావేశ మందిరంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 44 అర్జీలను స్వీకరించారు. ఇందులో భూభారతి-32, పెన్షన్-2, ఇందిరమ్మ ఇళ్లు-2, ఇతర సమస్యలపై- 9 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. వచ్చిన అర్జీలను వెంటనే పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

News January 12, 2026

వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి: కలెక్టర్

image

స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పిలుపునిచ్చారు. సోమవారం పెద్ద శంకరంపేట రైతు వేదికలో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన పాల్గొన్నారు. అనంతరం వివేకానంద జయంతి వేడుకల్లో భాగంగా చిత్రపటానికి నివాళులర్పించారు. యువత కేవలం చదువుకే పరిమితం కాకుండా క్రీడలు, సాంస్కృతిక రంగాల్లోనూ రాణించి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కలెక్టర్ సూచించారు.