News July 17, 2024

గ్రాడ్యుయేట్లకు ప్రతి నెలా రూ.10వేల భత్యం ప్రకటించిన షిండే ప్రభుత్వం

image

మహారాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం కొత్త పథకాన్ని ప్రకటించింది. దీని ద్వారా 12వ తరగతి పాసైన విద్యార్థులకు ప్రతి నెలా రూ.6000, డిప్లొమా చేసిన వారికి రూ.8వేలు, గ్రాడ్యుయేట్స్‌కు రూ.10వేల భత్యం ఇవ్వనున్నట్లు షిండే ప్రభుత్వం తెలిపింది. విద్యార్థులకు ఉపాధిని మెరుగుపరిచేందుకు నైపుణ్య శిక్షణలో భాగంగా ఏడాది పాటు ఈ భత్యం చెల్లించనున్నారు. కాగా రాష్ట్రంలో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి.

Similar News

News November 11, 2025

థైరాయిడ్ వల్ల జుట్టు ఊడుతోందా?

image

కొంతమందిలో థైరాయిడ్ కంట్రోల్​లో ఉన్నప్పటికీ హెయిర్‌ఫాల్ అవుతుంటుంది. దీనికి విటమిన్ డి, కాల్షియం లోపం కారణం కావొచ్చంటున్నారు నిపుణులు. కాబట్టి చేపలు, గుడ్లు, పాల సంబంధిత ఉత్పత్తులు, నువ్వులు, డేట్స్, నట్స్ వంటి కాల్షియం రిచ్ ఫుడ్స్, డి విటమిన్ ఎక్కువగా ఉండే ఆహారాలు డైట్​లో చేర్చుకోవాలని ఎండోక్రినాలజిస్టులు సూచిస్తున్నారు. ✍️ మరింత ఉమెన్, చైల్డ్ కేర్ కంటెంట్ కోసం <<-se_10014>>వసుధ<<>> కేటగిరీకి వెళ్లండి.

News November 11, 2025

ఆత్మాహుతి దాడి వెనుక జైష్-ఇ-మహమ్మద్!

image

ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబ్ బ్లాస్ట్ ఆత్మాహుతి దాడేనని కేసు దర్యాప్తు చేస్తున్న ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. దీని వెనుక జైష్-ఇ-మహమ్మద్ ఉన్నట్లు తెలిపాయి. దేశ రాజధాని నడిబొడ్డున కూడా దాడిచేసే సామర్థ్యం తమకు ఉందని చెప్పేందుకే ఎర్రకోటను ఎంచుకున్నట్లు పేర్కొన్నాయి. కాగా ఈ కేసు విచారణను కేంద్రం ఎన్ఐఏకు అప్పగించిన విషయం తెలిసిందే.

News November 11, 2025

గట్లు చెక్కే యంత్రంతో కలిగే లాభాలు

image

సాధారణంగా ఇద్దరు మనుషులు రోజంతా కష్టపడితే ఎకరం పొలంలో గట్టు చెక్కగలరు. ఈ యంత్రం సహాయంతో ఒక రోజులో 15 నుంచి 25 ఎకరాల వరకు గట్లు చెక్కవచ్చు. ఈ యంత్రం సాయంతో గంటకు 3-4 ఎకరాల్లో.. దాదాపు 18 ఇంచుల వరకూ గట్లు చెక్కవచ్చంటున్నారు నిపుణులు. ఈ మెషిన్ భాగాలు స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేయడం వల్ల బురదలో నడిచినా తుప్పు పట్టవు. అతి ముఖ్యంగా కూలీల కొరత సమస్యకు ఈ యంత్రం చెక్ పెడుతుంది.