News July 17, 2024

AP మీకు స్వాగతం పలుకుతోంది: కంపెనీలకు లోకేశ్ రిక్వెస్ట్

image

కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంతో అక్కడి కంపెనీలను ఆకర్షించేందుకు ఏపీ ఐటీ మంత్రి లోకేశ్ సిద్ధమయ్యారు. NASSCOM చేసిన ట్వీట్‌కు స్పందిస్తూ వారిని ఏపీకి ఆహ్వానించారు. ‘వైజాగ్‌లోని మా IT, AI & డేటా సెంటర్ క్లస్టర్‌కి మీ కంపెనీలను మార్చుకునేందుకు స్వాగతిస్తున్నాం. మీకు అత్యుత్తమ సౌకర్యాలు, నిరంతర విద్యుత్, మౌలిక వసతులను ప్రభుత్వం కల్పిస్తుంది. మీకు స్వాగతం పలికేందుకు ఏపీ సిద్ధంగా ఉంది’ అని ట్వీట్ చేశారు.

Similar News

News March 25, 2026

ఉగ్రవాద దేశం మధ్యవర్తిత్వమా?

image

అమెరికా-ఇరాన్ యుద్ధాన్ని ఆపేందుకు పాకిస్థాన్ మధ్యవర్తిగా ఉండటంపై నెట్టింట తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఉగ్రవాదానికి బ్రాండ్ అంబాసిడర్ అయిన పాక్‌కు ఏ అర్హత ఉందని ప్రశ్నిస్తున్నారు. కాగా ఇరాన్ తర్వాత షియా ముస్లింలు ఎక్కువగా ఉండటం, ట్రంప్‌తో పాక్ ఎయిర్ మార్షల్ మునీర్ స్నేహం కారణంగానే ఇది సాధ్యమైందని పలువురు పేర్కొంటున్నారు. దీనిపై మీ కామెంట్?

News March 25, 2026

మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్

image

AP: సొంత ఊరికి దూరంగా ఉంటూ నగరాలు, పట్టణాల్లో ఉద్యోగం చేసే మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారి వసతి, భద్రత కోసం రాష్ట్రవ్యాప్తంగా ‘సఖి నివాస్’ పేరిట కొత్తగా 30 వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఒక్కో హాస్టల్‌లో 30 మందికి వసతి కల్పించనుంది. ఇందులో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగినులతో పాటు చదువుకునే యువతులకు తక్కువ ధరకే వసతి, భోజన సదుపాయం కల్పించనున్నారు.

News March 25, 2026

షేన్ వార్న్ దూరదృష్టి.. RR డీల్‌తో పిల్లలకు భారీ ఆస్తి!

image

RR మాజీ కెప్టెన్, దివంగత షేన్ వార్న్ ముందుచూపు ఎలాంటిదో ఇప్పుడు రుజువైంది. IPL ప్రారంభంలో 4 సీజన్లకు కలిపి కేవలం ₹9.35 కోట్ల శాలరీ మాత్రమే తీసుకున్న ఆయన రిటైర్మెంట్ డీల్‌లో ఆడిన ప్రతి సీజన్‌లో 0.75% వాటా కావాలని కండిషన్ పెట్టారు. అలా 4 ఏళ్లలో 3% వాటా దక్కించుకున్నారు. తాజాగా RR ₹15,301 కోట్లకు అమ్ముడవడంతో ఆ 3% విలువ ఏకంగా ₹460 కోట్లకు చేరింది. ఇప్పుడు వార్న్ పిల్లలు కోటీశ్వరులయ్యారు.