News July 22, 2024
భారీ వర్షాలు.. వారికి రూ.20వేలు ప్రకటించిన ప్రభుత్వం

TG: భద్రాద్రి(D) అశ్వారావుపేట సమీపంలో గండిపడిన పెద్దవాగు ప్రాజెక్టును మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ‘అధికారుల నిర్లక్ష్యంతోనే గండి పడింది. సమయానికి గేట్లు ఎత్తి ఉంటే ప్రమాదం జరిగేది కాదు. నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం ఆదుకుంటుంది. కొట్టుకుపోయిన గొర్రెలకు రూ.3వేలు, ఆవులు, గేదెలకు రూ.20వేలు ఇస్తాం. పత్తి, వరి పంటలు నష్టపోయిన వారికి ఉచితంగా విత్తనాలు ఇస్తాం’ అని ప్రకటించారు.
Similar News
News February 5, 2026
$400bn మార్కును దాటిన గూగుల్ రెవెన్యూ: సుందర్ పిచాయ్

గూగుల్ యాన్యువల్ రెవెన్యూ తొలిసారిగా 400 బిలియన్ డాలర్ల మార్కును క్రాస్ చేసిందని సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. FY25 Q4 ఫలితాలను ఆయన వెల్లడించారు. 2025లో యూట్యూబ్ రెవెన్యూ 60 బిలియన్ డాలర్లను దాటినట్లు పేర్కొన్నారు. జెమినీ యాప్ మంత్లీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 750M+గా ఉన్నట్లు చెప్పారు. AI స్టాక్, జెమినీ 3 అడాప్షన్ తమ కంపెనీ ప్రోగ్రెస్కి ఫ్యూయల్లా పనిచేస్తున్నాయని వివరించారు.
News February 5, 2026
ఎయిమ్స్ గోరఖ్పూర్లో జూనియర్ రెసిడెంట్ పోస్టులు

<
News February 5, 2026
ఉదయం లేవగానే ఇది కనిపించిందా?

శాస్త్రాల ప్రకారం ఉదయం నిద్రలేవగానే బల్లిని చూడటం అదృష్టం. ఇది మీ దురదృష్టం తొలగి, విజయం వరించడాన్ని సూచిస్తుంది. బల్లి గోడపైకి పాకుతూ కనిపిస్తే పదోన్నతికి, ఆర్థిక లాభానికి సంకేతం. జ్యోతిషశాస్త్రం ప్రకారం బల్లి తలపై పడితే సమాజంలో గౌరవం పెరుగుతుందని, భుజంపై పడితే పోటీ పరీక్షల్లో విజయం లభిస్తుందని నమ్మకం. ఈ శుభ శకునాలు మీ జీవితంలో సానుకూల మార్పులను, సిరిసంపదలను తీసుకువస్తాయి.


