News July 25, 2024
ఇండియాలోని ఆ ప్రదేశాలకు వెళ్లొద్దని US హెచ్చరికలు

ఇండియాకు వచ్చే తమ పౌరులకు అమెరికా ట్రావెల్ అడ్వైజరీలో పలు మార్పులు చేసింది. J&K, PAK బార్డర్, మణిపుర్, ఈశాన్య రాష్ట్రాల్లో పలు ప్రాంతాలకు వెళ్లొద్దంది. టెర్రరిజం, క్రైమ్, హింసను కారణాలుగా చూపింది. తూర్పు లద్దాక్ ప్రాంతం, లేహ్కు వెళ్లవచ్చంది. నక్సల్స్ తదితర ప్రభావమున్న తూర్పు MH, ఛత్తీస్గఢ్ వెళ్లాలనుకుంటే అనుమతి తీసుకోవాలని సూచించింది. ఆయా ప్రాంతాల్లో US ఎమర్జెన్సీ సేవలు పరిమితంగా ఉన్నాయంది.
Similar News
News November 4, 2025
వరల్డ్కప్ విజేతలు విక్టరీ పరేడ్కు దూరం

ICC ఉమెన్స్ వరల్డ్కప్ను కైవసం చేసుకున్న భారత జట్టు విక్టరీ పరేడ్కు దూరం కానుంది. ఈ మేరకు BCCI ప్రకటించింది. ఈ ఏడాది IPL కప్ విజేత RCB చేపట్టిన పరేడ్లో తొక్కిసలాట జరిగి ఫ్యాన్స్ మరణించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో భద్రతా కారణాలతో ర్యాలీ చేపట్టడం లేదని చెబుతున్నారు. రేపు ఢిల్లీలో PM చేతుల మీదుగా టీమ్ ఇండియాను సన్మానిస్తారు. తొలిసారి ఉమెన్ వరల్డ్కప్ గెలిచినా పరేడ్ లేకపోవడంపై విమర్శలొస్తున్నాయి.
News November 4, 2025
మునగాకు పొడితో యవ్వనం

ఆరోగ్యంతో పాటు అందాన్ని పెంచడంలో మునగాకుపొడి కీలకపాత్ర పోషిస్తుంది. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పీచు పదార్థం, యాంటీ ఆక్సిడెంట్లు బరువు, ఒత్తిడిని తగ్గించడంతో పాటు జీర్ణక్రియ, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మునగ పొడిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల చర్మం, కురులు మెరుపును సంతరించుకుంటాయి. దీంట్లోని విటమిన్లు, మినరల్స్ చర్మాన్ని యవ్వనంగా మార్చుతాయి.
News November 4, 2025
రేపే కార్తీక పౌర్ణమి.. ఏమేం చేయాలంటే?

కార్తీక పౌర్ణమి రోజున ఉదయాన్నే నదీ స్నానమాచరించి, శివలింగానికి రుద్రాభిషేకం చేయాలని పండితులు చెబుతున్నారు. ‘నదీ స్నానం చేయలేనివారు గంగా జలం కలిపిన నీటితో స్నానం చేయవచ్చు. ఈరోజు సత్యనారాయణ వ్రతం చేసినా, ఆయన కథ విన్నా శుభం కలుగుతుంది. తులసి పూజతో పాటు 365 వత్తులతో దీపం వెలిగించాలి. శివాలయంలో దీపారాధన చేస్తే ఎంతో పుణ్యం’ అని అంటున్నారు.
☞ కార్తీక పౌర్ణమి గురించి మరిన్ని విశేషాల కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.


