News July 29, 2024
పెరిగిన ధరలు.. ఆచితూచి కొంటున్న ప్రజలు

TG: కూరగాయల ధరలు భారీగా పెరగడంతో కొనుగోళ్లు తగ్గాయి. నిత్యం 40% నిల్వలు మిగిలిపోతుండగా ఎక్కువ కూరగాయలు కుళ్లిపోతున్నాయి. దీంతో రైతులు, వ్యాపారులు వాటిని పారబోస్తుండగా రోజుకు రూ. రూ.2 కోట్ల నష్టం వాటిల్లుతోంది. రాష్ట్రంలో కూరగాయల సాగు ఆలస్యమవడంతో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఫలితంగా రేట్లు విపరీతంగా పెరిగాయి. బీన్స్, పచ్చిమిర్చి KG రూ.150, చిక్కుడు రూ.100 పలుకుతున్నాయి.
Similar News
News April 1, 2026
భారీగా పెరిగిన బంగారం ధర.. కారణం ఇదే

పశ్చిమాసియాలో ఘర్షణలు తగ్గొచ్చనే అంచనాలు, బ్యాంకులు వడ్డీ రేట్లను సవరించవనే నమ్మకంతో బంగారం, వెండికి డిమాండ్ పెరిగింది. దీంతో మళ్లీ ధరలు పెరుగుతున్నాయి. ఇవాళ రెండుసార్లు రేట్లు ఎగిశాయి. HYD బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ఏకంగా ₹3,440 పెరిగి ₹1,52,950 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹3,150 పెరిగి ₹1,40,200కు చేరింది. ఇక కేజీ వెండి ధర ₹2,65,000గా ఉంది.
News April 1, 2026
ధురంధర్-2: పుష్ప-2, బాహుబలి-2 రికార్డులు బ్రేక్ అవుతాయా?

‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. 14 రోజుల్లోనే ₹1,435 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. త్వరలోనే ₹1,500 కోట్ల క్లబ్లో చేరడం ఖాయంగానే కనిపిస్తోంది. అయితే పుష్ప-2 నెలకొల్పిన ₹1,800 కోట్ల రికార్డును మాత్రం బ్రేక్ చేయడం ఈ సినిమాకు పెద్ద టాస్కే. ఇక బాహుబలి-2 పేరిట ఉన్న ₹2,000 కోట్ల రికార్డును అందుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో అసాధ్యమని విశ్లేషకులు చెబుతున్నారు.
News April 1, 2026
పెరగనున్న మారుతీ కార్ల ధరలు!

తమ కార్ల ధరలు పెరిగే అవకాశం ఉందని మారుతీ సుజుకీ ప్రకటించింది. పశ్చిమాసియా యుద్ధం వల్ల కమొడిటీ ధరలు పెరగడం, గతేడాది GST తగ్గింపు వల్ల వచ్చిన లాభాలు తుడిచిపెట్టుకుపోవడమే అందుకు కారణమని వివరించింది. కార్ల తయారీలో వాడే ఆయిల్, గ్యాస్ సహా కీలక లోహాల ధరలు పెరిగినట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు సప్లైలో ఎలాంటి అడ్డంకులు లేనప్పటికీ.. రాబోయే రోజుల్లో ఉండొచ్చని అంచనా వేసింది.


