News July 29, 2024
రిటైర్మెంట్ ప్రకటించిన భారత టెన్నిస్ స్టార్
భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న రిటైర్మెంట్ ప్రకటించారు. ఇకపై తాను ఇంటర్నేషనల్ టెన్నిస్ ఆడబోనని వెల్లడించారు. పారిస్ ఒలింపిక్స్ పురుషుల డబుల్స్ ఈవెంట్స్ ఓపెనింగ్ రౌండ్లోనే బోపన్న-బాలాజీ జోడీ ఓడిన విషయం తెలిసిందే. కాగా బెంగళూరుకు చెందిన బోపన్న అత్యంత పెద్ద వయసు(43)లో డబుల్స్ విభాగంలో వరల్డ్ నంబర్ వన్గా నిలిచి రికార్డు సృష్టించారు. అర్జున, పద్మశ్రీ వంటి పురస్కారాలూ అందుకున్నారు.
Similar News
News February 1, 2025
Income Tax: ఎవరికి ఎంత డబ్బు ఆదా అవుతుందంటే..
కొత్త పన్ను విధానంలో ప్రస్తుత శ్లాబుల ప్రకారం ₹8L ఆదాయముంటే ₹30K, ₹9Lకు ₹40K, ₹10Lకు ₹50K, ₹11Lకు ₹65K, ₹12Lకు ₹80K పన్ను కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు SD, రిబేటుతో కలిపి ₹12.75L వరకు పన్ను లేదు కాబట్టి ఆ మేరకు లబ్ధి కలిగినట్టే. గతంతో పోలిస్తే ఇక నుంచి ₹16Lకు ₹50K, ₹20Lకు ₹90K, ₹24Lకు ₹1.10L, ₹50Lకు ₹1.10L మేర ట్యాక్స్ బెనిఫిట్ కల్పించారు. అంటే వీరికి సగటున ఏటా 30% డబ్బు ఆదా అవుతున్నట్టే.
News February 1, 2025
నేతల మధ్య అంతరాలు లేకుండా చూడాలి: సీఎం
TG: ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీలో సమన్వయం కోసం అందరూ కలిసి పని చేయాలని సీఎం రేవంత్, మంత్రులు నిర్ణయించారు. మంత్రులతో సీఎం నిర్వహించిన అత్యవసర భేటీలో పార్టీ, ప్రభుత్వ అంతర్గత అంశాలపై చర్చించారు. జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య అంతరాలు లేకుండా చూడాలని మంత్రులకు సీఎం సూచించారు.
News February 1, 2025
బడ్జెట్లో పోలవరానికి రూ.5,936 కోట్లు
AP: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం సవరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ.30,436.95 కోట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుత బడ్జెట్లో పోలవరానికి రూ.5,936 కోట్లు కేటాయించింది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి మరో రూ.54 కోట్లు కేటాయించింది. 41.15 మీటర్ల ఎత్తులో నీటి నిల్వను ఆమోదించింది.