News July 30, 2024

ఇకపై డోలీ మోతలు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు

image

AP: గిరిజన ప్రాంతాల్లో ఇకపై డోలీ మోతలు కనిపించకూడదని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. గిరిజన సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన, గత ప్రభుత్వ హయాంలో గిరిజనుల జీవన ప్రమాణాలు పడిపోయాయని అన్నారు. గిరిజన మహిళల సౌకర్యానికి గర్భిణీ వసతి గృహాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ట్రైకార్, జీసీసీ, ఐటీడీఏలను క్రియాశీలం చేయాలని, ఫీడర్ అంబులెన్సులు తిరిగి ప్రవేశపెట్టాలని సూచించారు.

Similar News

News March 6, 2025

నష్టాల్లోంచి లాభాల్లోకి వచ్చిన స్టాక్‌మార్కెట్లు

image

ఆరంభంలో నష్టపోయిన దేశీయ స్టాక్‌మార్కెట్లు మధ్యాహ్నం భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ 22,440 (+111), సెన్సెక్స్ 73,991 (+280) వద్ద చలిస్తున్నాయి. ఉదయం ఈ సూచీలు అరశాతం మేర పతనమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఐటీ మినహా అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. మెటల్, ఆయిల్ & గ్యాస్, కమోడిటీస్, ఎనర్జీ, ఫార్మా, హెల్త్‌కేర్, మీడియా షేర్లు దుమ్మురేపుతున్నాయి. NSEలో 2818 షేర్లు ట్రేడవ్వగా ఏకంగా 2255 పెరిగాయి.

News March 6, 2025

రిటైర్మెంట్‌పై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

image

AP: ఒక్కసారిగా రిటైర్మెంట్ జీవితంలోకి మారినా దగ్గుబాటి హ్యాపీగా ఉన్నారని సీఎం చంద్రబాబు చెప్పారు. తనకూ ఆ పరిస్థితి వస్తే సిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో ఎలా సమయం వెచ్చిస్తున్నారని ఆయనను అడిగానన్నారు. ‘ఉదయాన్నే బ్యాడ్మింటన్, తర్వాత మనవళ్లు, మనవరాళ్లతో ఆటలు, స్నేహితులతో మాటలు, పేకాట, రాత్రి పిల్లలకు కథలు చెప్పి సంతోషంగా నిద్రపోతా అని దగ్గుబాటి చెప్పారు. ఇదో వండర్‌ఫుల్ లైఫ్’ అని పేర్కొన్నారు.

News March 6, 2025

జైశంకర్‌పై ఖలిస్థానీల దాడి యత్నంపై మండిపడ్డ భారత్

image

EAM జైశంకర్ UK పర్యటనలో భద్రతా <<15666524>>లోపంపై<<>> భారత్ తీవ్రంగా స్పందించింది. ఖలిస్థానీలవి రెచ్చగొట్టే చర్యలని మండిపడింది. ‘జైశంకర్ పర్యటనలో భద్రతా లోపాన్ని ఫుటేజీలో మేం పరిశీలించాం. వేర్పాటువాదులు, అతివాదుల రెచ్చగొట్టే చర్యల్ని ఖండిస్తున్నాం. వారు ప్రజాస్వామ్య స్వేచ్ఛను దుర్వినియోగం చేయడం విచారకరం. ఇలాంటి ఘటనలపై ఆతిథ్య ప్రభుత్వం మేం కోరుకుంటున్నట్టు కఠిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం’ అని తెలిపింది.

error: Content is protected !!