News July 31, 2024
అమరావతి రైల్వేలైన్ భూసేకరణకు అధికారుల నియామకం

AP: అమరావతి రైల్వే లైన్ నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు మధ్య 56.53కి.మీ మేర నిర్మించే ఈ లైన్ భూసేకరణ కోసం అధికారులను రైల్వేశాఖ నియమించింది. గుంటూరు జిల్లా పెదకాకాని, తాడికొండ, తుళ్లూరు మండలాల్లో గుంటూరు జేసీ, NTR(D) ఇబ్రహీంపట్నంలో విజయవాడ RDO, కంచికచర్ల, వీరులపాడులో నందిగామ RDO, పల్నాడు(D) అమరావతిలో సత్తెనపల్లి RDOకు భూసేకరణ బాధ్యతలను అప్పగించింది.
Similar News
News January 30, 2026
వరల్డ్ కప్ గెలిస్తే ఇంకేం చేస్తారో?.. పాక్ పీఎం ట్వీట్పై సెటైర్లు!

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో పాకిస్థాన్ 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన ట్వీట్ ఇప్పుడు SMలో ట్రోల్స్కు గురవుతోంది. ఆస్ట్రేలియా ‘B’ టీమ్పై గెలిస్తేనే ప్రపంచకప్ గెలిచినంతగా PCB ఛైర్మన్ను ఆకాశానికెత్తడంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇక WC గెలిస్తే ఏం చేస్తారో అంటూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. క్రికెటర్ ఆకాశ్ చోప్రా కూడా ఇది అతిగా ఉందన్నారు.
News January 30, 2026
మధ్యాహ్నం కునుకు.. బ్రెయిన్కు ఫుల్ కిక్కు

మధ్యాహ్నం పూట చిన్న నిద్ర (Nap) వల్ల రాత్రి నిద్రతో సమానమైన ఎఫెక్ట్ ఉంటుందని రీసెర్చర్స్ తేల్చారు. వాళ్ల స్టడీ ప్రకారం.. రోజంతా పనులు, ఆలోచనల వల్ల బ్రెయిన్లోని నెర్వ్ సెల్స్ బాగా అలసిపోతాయి. ఇలాంటి టైమ్లో ఒక చిన్న కునుకు తీస్తే బ్రెయిన్ కనెక్షన్స్ మళ్లీ రీ-ఆర్గనైజ్ అవుతాయి. బ్రెయిన్పై లోడ్ తగ్గి కొత్త విషయాలను నేర్చుకోవడానికి సిద్ధమవుతుంది. ఇన్ఫర్మేషన్ మరింత ఎఫెక్టివ్గా స్టోర్ అవుతుంది.
News January 30, 2026
బోర్ కొడుతుందని ఖాళీ సమయంలో చదివి..!

రైలులో వెళ్లే సమయాన్ని చదివేందుకు కేటాయించి BARC శాస్త్రవేత్తగా ఎదిగిన వేలుమణి జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. ఆయన కోయంబత్తూర్ రామకృష్ణ మిషన్ విద్యాలయంలో చదువుకోగా పేదరికంతో హాస్టల్లో ఉండలేక రోజూ రైలులో ప్రయాణించేవారు. ఈ జర్నీలో రోజుకు 6 గంటల ఖాళీ టైమ్ దొరికేది. ఈ సమయంలో గణితం, ఫిజిక్స్ చదువుకున్నానని వేలుమణి ట్వీట్ చేశారు. ఆయన స్థాపించిన థైరోకేర్ టెక్నాలజీస్ నెట్వర్త్ రూ.5వేల కోట్లు.


