News August 1, 2024

కేరళ డిజాస్టర్.. 270 దాటిన మరణాలు!

image

కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మరణాల సంఖ్య 270 దాటినట్లు తెలుస్తోంది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సైన్యం, NDRF సిబ్బంది సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. మృతుల్లో 22 మంది చిన్నారులు ఉన్నారు. ఇప్పటివరకు 166 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. గాయపడిన 191 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంకా 225 మంది గల్లంతైనట్లు సమాచారం.

Similar News

News July 4, 2025

అనిరుధ్ రెడ్డిపై టీపీసీసీ సీరియస్.. నోటీసులు ఇచ్చే అవకాశం?

image

TG: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిపై టీపీసీసీ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఆయనకు షోకాజ్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. తెలంగాణలో చంద్రబాబు కోవర్టులు ఉన్నారని, ఇరిగేషన్&రోడ్డు కాంట్రాక్టులు చూసేది వారేనని ఇటీవల అనిరుధ్ <<16911067>>వ్యాఖ్యానించిన<<>> సంగతి తెలిసిందే. దీనిపై వివరణ కోరి నివేదిక ఇవ్వాలని పార్టీ క్రమశిక్షణ కమిటీని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ ఆదేశించినట్లు సమాచారం.

News July 4, 2025

దేశ వ్యతిరేక పోస్టులపై కఠిన చర్యలు?

image

దేశానికి వ్యతిరేకంగా కంటెంట్ క్రియేట్ చేసే వారికి చుక్కలు చూపించేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకోసం కేంద్ర హోంశాఖ కొత్త పాలసీని రూపొందిస్తున్నట్లు సమాచారం. వెబ్‌సైట్లు, సోషల్ మీడియాలో పెట్టే కంటెంట్‌ను పరిశీలించి, దేశ వ్యతిరేక పోస్టులను గుర్తించేందుకు ఓ టీమ్‌ను ఏర్పాటు చేయనుంది. ఆయా అకౌంట్లను బ్లాక్ చేయడంతో పాటు పోస్ట్ చేసిన వారిపైనా కఠిన చర్యలు తీసుకోనున్నట్లు వార్తలొస్తున్నాయి.

News July 4, 2025

AI ద్వారా భూ సమస్యల పరిష్కారం: మంత్రి అనగాని

image

AP: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా రాష్ట్రంలోని భూ సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. భూములను ఆధార్, సర్వే నంబర్లతో లింక్ చేస్తామని చెప్పారు. ‘రైతులకు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సలహాలు ఇస్తున్నాం. గ్రీవెన్స్ ద్వారా ఇప్పటివరకు 4.63 లక్షల ఫిర్యాదులు రాగా 3.99 లక్షల ఫిర్యాదులు పరిష్కరించాం. త్వరలోనే మిగతా వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం’ అని పేర్కొన్నారు.