News August 1, 2024

కేరళ డిజాస్టర్.. 270 దాటిన మరణాలు!

image

కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మరణాల సంఖ్య 270 దాటినట్లు తెలుస్తోంది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సైన్యం, NDRF సిబ్బంది సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. మృతుల్లో 22 మంది చిన్నారులు ఉన్నారు. ఇప్పటివరకు 166 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. గాయపడిన 191 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంకా 225 మంది గల్లంతైనట్లు సమాచారం.

Similar News

News January 17, 2026

జపాన్‌ వెకేషన్‌లో అల్లు అర్జున్.. ఫ్యామిలీ పిక్ వైరల్

image

టోక్యోలోని సెన్‌సో-జి ఆలయానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి వెళ్లారు. భార్య స్నేహా రెడ్డి, కొడుకు అయాన్, కూతురు అర్హతో దిగిన ఫోటోను SMలో ఆయన షేర్ చేశారు. షేర్ చేసిన క్షణాల్లోనే ఈ పిక్‌ను అభిమానులు వైరల్ చేసేశారు. సినిమాలు, ఫ్యామిలీకి సమానంగా టైమ్ కేటాయిస్తూ ఫ్యామిలీ మ్యాన్ అనిపించుకుంటున్నారని కామెంట్స్ పెడుతున్నారు.

News January 17, 2026

తక్కువ అర్హత పోస్టులకు వారిని మినహాయించొచ్చు: SC

image

ఎక్కువ అర్హతల వారిని తక్కువ అర్హత పోస్టుల నుంచి మినహాయించొచ్చని SC కీలక తీర్పిచ్చింది. బిహార్ GOVT ఫార్మసిస్ట్ రిక్రూట్మెంటులో డిప్లొమా ఫార్మసీని అర్హతగా నిర్ణయించింది. దీనిపై B.ఫార్మా, M.ఫార్మా అభ్యర్థులు HCకి వెళ్లారు. డిప్లొమా వారితో పోలిస్తే వీరికి ప్రాక్టికల్స్ తక్కువన్న GOVT వాదనతో HC ఏకీభవించి పిిటిషన్‌ను కొట్టేసింది. అర్హతలపై తుదినిర్ణయం GOVTదేనంది. SC దీన్నే సమర్థించి తాజా తీర్పిచ్చింది.

News January 17, 2026

నోబెల్ బహుమతి కోసం ఇంత పిచ్చా: కైలాశ్ సత్యార్థి

image

US అధ్యక్షుడు ట్రంప్ ఎట్టకేలకు <<18868941>>మరియా మచాడో<<>> నుంచి నోబెల్ ప్రైజ్ అందుకున్న విషయం తెలిసిందే. ఇది తనను షాక్‌కు గురి చేసిందని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి చెప్పారు. ‘పీస్ ప్రైజ్ కోసం ఇంత పిచ్చిగా ఉన్న వ్యక్తిని ఎన్నడూ చూడలేదు. అవార్డును బదిలీ చేయలేమని <<18821416>>నోబెల్ కమిటీ<<>> చెప్పినట్లు వార్తలొచ్చాయి’ అని జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్‌లో అన్నారు. 2014లో సత్యార్థి నోబెల్ అందుకున్నారు.