News August 1, 2024
All Time Record: నిఫ్టీ 25K, సెన్సెక్స్ 82K బ్రేక్

ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు నేడు సరికొత్త రికార్డులు సృష్టించాయి. NSE నిఫ్టీ తొలిసారి 25000 మార్క్ దాటింది. 24000 నుంచి మరో 1000 పాయింట్లు పెరిగేందుకు సూచీ కేవలం 25 సెషన్లే తీసుకుంది. BSE సెన్సెక్స్ మొదటి సారి 82000 స్థాయిని అధిగమించింది. 82129 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. చివరి 1000 పాయింట్ల కోసం 11 సెషన్లే తీసుకుంది. ఇది All Time Record.
Similar News
News January 11, 2026
UPSC పరీక్షలకు కొత్త రూల్

UPSC పరీక్షల్లో పారదర్శకత పెంచేందుకు ఇకపై అభ్యర్థులందరికీ ‘ఫేస్ అథెంటికేషన్’ తప్పనిసరి చేశారు. Ai టెక్నాలజీతో పనిచేసే ఈ విధానాన్ని ఇప్పటికే NDA, CDS పరీక్షల్లో పైలట్ ప్రాజెక్టుగా విజయవంతంగా పరీక్షించారు. దీని వల్ల వెరిఫికేషన్ కేవలం 10 సెకన్లలోనే పూర్తవుతుందని, సమయమూ ఆదా అవుతుందని యూపీఎస్సీ ఛైర్మన్ అజయ్ కుమార్ తెలిపారు. ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాయడం వంటి మోసాలకు ఫేస్ అథెంటికేషన్తో చెక్ పడనుంది.
News January 11, 2026
ఠాక్రేలు తలచుకుంటే 10 నిమిషాల్లో ముంబై బంద్: రౌత్

ముంబై రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఎన్నికల వేళ శివసేన (UBT) నేత సంజయ్ రౌత్ సంచలన కామెంట్స్ చేశారు. ఠాక్రే ఫ్యామిలీ పవర్ ఇప్పటికీ తగ్గలేదని, తలచుకుంటే కేవలం 10 నిమిషాల్లో ముంబైని స్తంభింపజేయగలరని వ్యాఖ్యానించారు. 20 ఏళ్ల తర్వాత BMC ఎన్నికల నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే కలవడంపై ఆయన ఈ విధంగా స్పందించారు. ఎన్నికల్లో ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా ఠాక్రేల క్రేజ్ తగ్గలేదంటూ ధీమా వ్యక్తం చేశారు.
News January 11, 2026
ఇంటి చిట్కాలు మీ కోసం

* స్టెయిన్ లెస్ స్టీల్ సింకులు మెరుపు తగ్గకుండా ఉండాలంటే, వెనిగర్లో ముంచిన స్పాంజ్తో శుభ్రం చెయ్యాలి.
* ఓవెన్లో వెనీలా ఎసెన్స్ ఉంచి కొద్దిసేపు వేడి చేస్తే లోపలి దుర్వాసనలు దూరమవుతాయి.
* నూనె డబ్బాల మీద బంగాళా దుంప ముక్కలతో రుద్దితే తుప్పు మరకలు రాకుండా ఉంటాయి.
* నీటిలో కాస్త వెనిగర్, లిక్విడ్ డిష్వాష్ కలిపి, దానిలో ముంచిన వస్త్రంతో కిటికీలను తుడిస్తే పేరుకున్న దుమ్ముపోతుంది.


