News August 2, 2024
అభివృద్ధికే భారత్ ప్రోత్సాహం.. విస్తరణవాదానికి కాదు: మోదీ

భారత పర్యటనకు వచ్చిన వియత్నాం ప్రధాని ఫామ్ చిన్తో PM మోదీ సమావేశమయ్యారు. వ్యూహాత్మక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా 6 MOUలపై అధికారులు సంతకాలు చేశారు. యాక్ట్ ఈస్ట్, ఇండో పసిఫిక్ విజన్లో భారత్కు వియత్నాం కీలక భాగస్వామి అని మోదీ చెప్పారు. అభివృద్ధిని మాత్రమే ఇండియా ప్రోత్సహిస్తుందని, విస్తరణవాదాన్ని కాదని తెలిపారు. కాగా సముద్ర భద్రత కోసం వియత్నానికి $300 మిలియన్లు అందించాలని భారత్ నిర్ణయించింది.
Similar News
News March 26, 2026
తూప్రాన్: తల్లి మరణం తట్టుకోలేక కొడుకు సూసైడ్

తూప్రాన్ మండలం ఘనపూర్ గ్రామంలో సబ్బని సంతోష్(40) బుధవారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై గంగరాజు తెలిపారు. సంతోష్ తల్లి భాగ్యమ్మ 15 రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటి నుంచి సంతోష్ తీవ్ర మనస్తాపంలో ఉన్నారు. ఈ క్రమంలో భార్యను మేనమామ ఇంటికి పంపి తాను వస్తానని చెప్పి ఇంట్లోనే ఉరివేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
News March 26, 2026
వరల్డ్ నంబర్ వన్ లీడర్ మోదీ: 68% రేటింగ్తో మళ్లీ టాప్!

USకు చెందిన ‘మార్నింగ్ కన్సల్ట్’ లేటెస్ట్ సర్వే ప్రకారం 68% అప్రూవల్ రేటింగ్తో మోదీ ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ లీడర్గా నిలిచారు. రెండో స్థానంలో స్విట్జర్లాండ్ ప్రెసిడెంట్ పార్మెలిన్, సౌత్ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యూంగ్ (62%) ఉన్నారు. US అధ్యక్షుడు ట్రంప్ (39%), బ్రిటన్ PM కీర్ స్టార్మర్ (24%) మోదీ కంటే వెనుకబడ్డారు. అలాగే నెహ్రూ తర్వాత అత్యధిక కాలం PMగా ఉన్న వ్యక్తిగా మోదీ చరిత్ర సృష్టించారు.
News March 26, 2026
ట్రంప్ నరకం చూపిస్తారు: వైబ్ హౌస్

ఇరాన్ తన ఓటమిని అంగీకరించకపోతే ఆ దేశాన్ని ఘోరంగా దెబ్బకొడతామని అమెరికా హెచ్చరించింది. ట్రంప్ అస్సలు తగ్గరని.. నరకాన్ని చూపిస్తారని వైట్ హౌస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ పేర్కొన్నారు. ప్రస్తుతం యుద్ధం నాలుగో వారంలో ఉండగా అగ్రరాజ్యం తన లక్ష్యాలకు చాలా దగ్గరలో ఉందని వెల్లడించింది. ఒకవైపు పాకిస్థాన్, తుర్కియే మధ్యవర్తిత్వానికి ప్రయత్నిస్తున్నా ఇరాన్ లొంగిపోవడమే మార్గమని వాషింగ్టన్ స్పష్టం చేస్తోంది.


