News August 2, 2024
వరి విత్తనాలపై 80% రాయితీ

AP: అధిక వర్షాలకు వరి పంట దెబ్బతిన్న జిల్లాల్లో 80 శాతం రాయితీతో విత్తనాలు సరఫరా చేయనున్నట్లు వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో 6,356 క్వింటాళ్ల విత్తనాలను రైతు సేవా కేంద్రాల వద్ద పంపిణీ చేస్తామన్నారు. ఈ ప్రాంతాల్లో గత నెలలో 1,406 హెక్టార్లలో నారు మడులు, 33 వేల హెక్టార్లలో వరి పంట నాశనమయ్యాయని చెప్పారు.
Similar News
News January 26, 2026
20 నిమిషాలకో ఇండియన్ అరెస్ట్

భవిష్యత్తు ఆశతో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ భారతీయులు అధికంగా పట్టుబడుతున్నారు. ఆ దేశ సరిహద్దుల్లో 2025లో ప్రతి 20 నిమిషాలకో ఇండియన్ అరెస్టయ్యారు. గత ఏడాది 23,830 మంది భారతీయులను అదుపులోకి తీసుకున్నట్లు US కస్టమ్స్ బోర్డర్ ప్రొటెక్షన్ వెల్లడించింది. 2024లో ఈ సంఖ్య 85,119గా ఉంది. గతేడాది వివిధ దేశాలకు చెందిన 3.91L మంది అరెస్టయ్యారు. కెనడా, మెక్సికో సరిహద్దుల్లో ఎక్కువ మంది పట్టుబడుతున్నారు.
News January 26, 2026
గంటల వ్యవధిలో స్వల్పంగా తగ్గిన గోల్డ్ రేటు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం <<18961013>>ధర<<>> ఉదయంతో పోల్చితే కాస్త తగ్గింది. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఉదయం రూ.1,62,710 ఉండగా రూ.760 తగ్గి రూ.1,61,950కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర ఉదయం నుంచి రూ.700 పతనమై రూ.1,48,450 పలుకుతోంది. అటు KG సిల్వర్ రేటు రూ.3,75,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.
News January 26, 2026
‘మన శంకరవరప్రసాద్ గారు’ కలెక్షన్లు ఎంతంటే?

చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఈ మూవీ నిన్నటి వరకు రూ.350 కోట్ల(గ్రాస్)కు పైగా వసూలు చేసింది. నిన్న జరిగిన ఈవెంట్లో మేకర్స్ స్పెషల్ పోస్టర్ వేశారు. ఈ సినిమా ఇప్పటికే అత్యధిక వసూళ్లు రాబట్టిన ప్రాంతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటించగా విక్టరీ వెంకటేశ్ స్పెషల్ రోల్ చేశారు.


