News August 2, 2024

Olympics: ఈరోజు భారత్ పాల్గొనే ఈవెంట్స్

image

ఇప్పటికే 2పతకాలు సాధించిన మను భాకర్ ఇవాళ జరిగే ఉమెన్స్ 25మీ. పిస్టల్ క్వాలిఫికేషన్ ఈవెంట్లో పాల్గొంటారు. ఆమెతో పాటు ఈషా సింగ్ బరిలో ఉన్నారు. బ్యాడ్మింటన్‌ క్వార్టర్స్‌లో లక్ష్యసేన్, మెన్స్ షూటింగ్‌లో అనంత్‌జీత్ పోటీ పడనున్నారు. ఆర్చరీ మిక్స్‌డ్-ధీరజ్, అంకిత, రోయింగ్ ఫైనల్-బల్‌రాజ్, షాట్‌పుట్-తజిందర్‌పాల్ బరిలో ఉన్నారు. మెన్స్ హాకీ టీమ్ ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. పూర్తి షెడ్యూల్ పైన ఫొటోల్లో..

Similar News

News March 12, 2025

కట్టెల పొయ్యితో మా అమ్మ పడిన కష్టాలు తెలుసు: చంద్రబాబు

image

AP: ఆడబిడ్డలు సైకిళ్లు తొక్కలేరనే భావన చెరిపేసేందుకు గతంలో విద్యార్థినులకు సైకిళ్లు ఇచ్చినట్లు CM చంద్రబాబు అన్నారు. ‘మగవాళ్ల కంటే ఆడవాళ్లు తెలివైనవాళ్లు. RTCలో మహిళా కండక్టర్లు బాగా రాణిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే ఆస్తులను మహిళల పేరుతోనే ఇస్తున్నాం. కట్టెల పొయ్యి వద్ద మా అమ్మ పడిన కష్టాలు నాకు తెలుసు. ఆ కష్టాలు తీరుస్తూ దీపం పథకం కింద 65లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం’ అని అసెంబ్లీలో అన్నారు.

News March 12, 2025

DDకి పునర్వైభవం రానుందా?

image

దూరదర్శన్‌ ఛానల్‌ను పునరుద్ధరించడానికి ప్రసారభారతి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ జర్నలిస్టు &న్యూస్ యాంకర్ సుధీర్ చౌదరితో సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. రాబోయే రోజుల్లో సుధీర్ దూర్‌దర్శన్‌లో పనిచేస్తారని, విశ్వసనీయ & ప్రభావవంతమైన వార్తలను అందించేందుకు కృషి చేస్తారని సమాచారం. ఈ ఒప్పందం కోసం దాదాపు రూ.14 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందంతో DD ఒక పవర్‌హౌస్‌గా మారే అవకాశం ఉంది.

News March 12, 2025

తల్లి, చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి సీఎంగా పనిచేశారు: CBN

image

AP: TDPతోనే మహిళా సాధికారత ప్రారంభమైందని అసెంబ్లీలో CM CBN అన్నారు. ‘ఎన్టీఆర్‌ మహిళలకు తొలిసారిగా ఆస్తి హక్కు కల్పించారు. కానీ తల్లి, చెల్లికి వాటా ఇవ్వని వ్యక్తి గతంలో CMగా(జగన్‌ను ఉద్దేశించి) ఉన్నారు. ఇచ్చిన ఆస్తిని కూడా వెనక్కి తీసుకునేందుకు కోర్టుకెళ్లారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తే వాటా ఇవ్వలేదు. ప్రస్తుత ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా మహిళలను దృష్టిలో పెట్టుకుంటోంది’ అని తెలిపారు.

error: Content is protected !!