News August 2, 2024

మద్యంపై CM చంద్రబాబు కీలక ఆదేశాలు

image

AP: గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో ఇకపై నాణ్యత లేని మద్యం కనిపించకూడదని అధికారులను ఆదేశించారు. వైసీపీ ప్రభుత్వం మద్యం ధరలు పెంచి పేదలను దోచుకుందని మండిపడ్డారు. సమగ్ర అధ్యయనం తర్వాత కొత్త ఎక్సైజ్ పాలసీని తీసుకొస్తామని CM వెల్లడించారు.

Similar News

News December 29, 2025

IIT ధన్‌బాద్‌లో 105 పోస్టులు… అప్లై చేశారా?

image

<>IIT <<>>ధన్‌బాద్‌లో 105 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. వీటిలో ఎస్సీలకు 32, ఎస్టీలకు 20, ఓబీసీలకు 53 పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పీహెచ్‌డీతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ /డిస్కషన్ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు Asst. profకు రూ.70,900, Asst. prof గ్రేడ్- 1కు రూ.1,01,500, అసోసియేట్ profకు రూ.1,39,600, profకు రూ.1,59,100 చెల్లిస్తారు. వెబ్‌సైట్: www.iitism.ac.in

News December 29, 2025

వివక్షపై భారతీయుడి పోరాటం.. అహంకారానికి ₹81 లక్షల గుణపాఠం

image

బ్రిటన్‌లోని ఓ KFC అవుట్‌లెట్‌లో పనిచేసే తమిళనాడు యువకుడు మాధేశ్ రవిచంద్రన్ జాతి వివక్షపై కోర్టులో పోరాడి గెలిచాడు. కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం మాధేశ్‌ను శ్రీలంక తమిళుడైన తన మేనేజర్ ‘బానిస’ ‘భారతీయులంతా మోసగాళ్లు’ అని అవమానించేవాడు. తట్టుకోలేక మాధేశ్ ఉద్యోగానికి రాజీనామా చేసి కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం సుమారు ₹81 లక్షల పరిహారం చెల్లించాలని మేనేజర్‌ను ఆదేశించింది.

News December 29, 2025

ఐదేళ్లలోపు పిల్లలకు ఇవి పెట్టకూడదు

image

పిల్లలకు కొన్నిరకాల ఆహారపదార్థాలు పెట్టడం వల్ల ఆరోగ్య సమస్యలొస్తాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఏడాదిలోపు పిల్లలకు తేనె పెడితే బొట్యులిజం అనే వ్యాధి వస్తుంది. దీంతో చిన్నారుల్లో చూపు మందగించడం, అలసట, నీరసం వస్తాయి. అలాగే పాశ్చరైజేషన్‌ చేయని పాలు, జ్యూసులు, పెరుగులో ఈ.కొలి బ్యాక్టీరియా పెరిగి విరేచనాలు, బరువు తగ్గడం వంటివి జరుగుతాయి. అలాగే స్వీట్లు, ఉప్పు కూడా ఎక్కువగా ఇవ్వకూడదని సూచిస్తున్నారు.