News August 2, 2024
ఆరోగ్య శ్రీ కొనసాగుతుంది.. అవాస్తవాలు నమ్మొద్దు: మంత్రి

AP: ఆరోగ్య శ్రీ తొలగిస్తామంటూ YCP అసత్య ప్రచారాలు చేస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకం కొనసాగుతుందని, తప్పుడు ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మొద్దని కోరారు. గత వైసీపీ ప్రభుత్వం ఆస్పత్రులకు రూ.2100 కోట్ల బకాయిలు పెట్టిన మాట వాస్తవమా? కాదా? YCP నేతలు చెప్పాలని నిలదీశారు. కేంద్రం 17 వైద్యకళాశాలలను 2020లో ప్రకటిస్తే వాటిని పూర్తి చేయలేని అసమర్థుడు జగన్ అని మండిపడ్డారు.
Similar News
News March 22, 2026
వ్యర్థాలతో గ్యాస్ ఉత్పత్తి.. 5 ప్లాంట్ల ఏర్పాటు

AP: పట్టణ ప్రాంతాల్లోని ఘన వ్యర్థాలను కంప్రెస్డ్ బయో గ్యాస్(CBG)గా మార్చే ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాజమండ్రి, నెల్లూరు, గుంటూరు, ఒంగోలులో కొత్తగా వీటిని ఏర్పాటు చేయనుండగా, విజయవాడలో ఇప్పటికే ఉన్న ప్లాంట్ను అప్గ్రేడ్ చేయనున్నారు. దీని కోసం ప్రభుత్వం రూ.59.85కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ప్రతి CBG ప్లాంట్ సామర్థ్యం రోజుకు 25 టన్నులు ఉంటుంది.
News March 22, 2026
కేరళంలో షిగెల్లా వ్యాధి.. చిన్నారి మృతి!

కేరళంలోని కోళికోడ్ జిల్లాలో షిగెల్లా వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతోంది. పెరువయల్ పంచాయతీలో ఇప్పటికే 12 మందికి పాజిటివ్ వచ్చింది. ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. కలుషిత ఆహారం, నీటి ద్వారా ఈ ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుంది. దీంతో రక్త విరేచనాలు, కడుపు నొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఐదేళ్లలోపు పిల్లలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. కాచి చల్లార్చిన నీటిని తాగాలి.
News March 22, 2026
ఇరాన్కు ట్రంప్ 48 గంటల డెడ్లైన్

ఎలాంటి కండీషన్స్ లేకుండా హార్ముజ్ జలసంధిని వెంటనే తెరవాలని ఇరాన్కు ట్రంప్ 48 గంటల గడువు విధించారు. లేదంటే ఇరాన్లోని అతిపెద్ద పవర్ ప్లాంట్లపై బాంబుల వర్షం కురిపిస్తామని హెచ్చరించారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడంతో పాటు చమురు ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో ఈ ప్రకటన వెలువడింది. ఇప్పటికే ఇరాన్ అణుకేంద్రం సమీపంలో మిస్సైల్ దాడులు జరిగిన నేపథ్యంలో ట్రంప్ ఇచ్చిన ఈ ‘అల్టిమేటం’ హాట్ టాపిక్గా మారింది.


