News August 3, 2024

నీట్ రాకముందు ఒక్కో పీజీ సీటుకు రూ.8-13 కోట్లు: నడ్డా

image

దేశంలో నీట్ రాకముందు మెడికల్ ఎడ్యుకేషన్ బహిరంగ వ్యాపారంగా ఉండేదని, భారీ అవినీతి జరిగేదని కేంద్ర మంత్రి జేపీ నడ్డా చెప్పారు. నీట్‌ను వ్యతిరేకిస్తూ డీఎంకే ఎంపీ అబ్దుల్లా రాజ్యసభలో ప్రైవేటు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై మంత్రి స్పందించారు. నీట్ ప్రవేశపెట్టక ముందు ఒక్కో పీజీ సీటు రూ.8కోట్ల నుంచి రూ.13 కోట్ల వరకు అమ్ముడుపోయేదని తెలిపారు. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవన్నారు.

Similar News

News March 13, 2026

పెరిగిన విమాన టికెట్ల ధరలు!

image

ఆయిల్ ధరలు పెరగడంతో టికెట్లపై ఇంధన సర్‌ఛార్జ్‌లు విధించాలని ఎయిర్‌లైన్స్ భావిస్తున్నాయి. ఇప్పటికే ఎయిరిండియా వసూలు చేస్తుండగా, తాజాగా ఇండిగో కూడా పెంచింది. రేపటి నుంచి సర్వీసులను బట్టి ₹425-2,300 అదనంగా ఛార్జ్ చేయనున్నట్లు తెలిపింది. మరోవైపు స్పైస్ జెట్, ఆకాశ ఎయిర్ కూడా అదే దారిలో వెళ్తాయని తెలుస్తోంది. ఈమేరకు అంతర్గత చర్చలు జరుపుతున్నాయని, త్వరలో ధరలు ఖరారు చేస్తాయని సమాచారం.

News March 13, 2026

USతో ట్రేడ్ డీల్‌ నిలిపివేత వార్తలు.. భారత్ స్పందన!

image

అమెరికాపై అధిక టారిఫ్‌లు వేస్తున్నాయంటూ భారత్, చైనా సహా 16 దేశాలపై <<19359537>>దర్యాప్తునకు<<>> ట్రంప్ ఆదేశించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో USతో ట్రేడ్ డీల్‌ను ఇండియా నిలిపేయనుందని Reuters తెలిపింది. ఒప్పందంపై సంతకం చేయకుండా కొన్ని నెలలు ఆలస్యం చేయనుందని పేర్కొంది. అయితే ఈ వార్తల్లో నిజం లేదని, పరస్పర ప్రయోజనకర ఒప్పందం కోసం రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయని కేంద్ర వాణిజ్య శాఖ తెలిపింది.

News March 13, 2026

7-8 గంటలు నిద్రపోయినా నీరసంగా ఉందా?

image

7-8 గంటలు పడుకున్నా ఉదయాన్నే నీరసంగా, తల భారంగా అనిపిస్తే అది కేవలం నిద్ర సమస్య కాకపోవచ్చునని డాక్టర్లు చెబుతున్నారు. విటమిన్ B12, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ D లోపం వల్ల ఎనర్జీ తగ్గి, కండరాల రికవరీ దెబ్బతింటుంది. దీంతో నిరంతరం అలసట, మూడ్ స్వింగ్స్, మెదడు మొద్దుబారడం వంటి సమస్యలొస్తాయి. సరైన ఆహారం, సూర్యరశ్మి, తగినంత నీరు తీసుకోవడంతో పాటు టెస్ట్‌లు చేయించుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.