News August 3, 2024
నీట్ రాకముందు ఒక్కో పీజీ సీటుకు రూ.8-13 కోట్లు: నడ్డా

దేశంలో నీట్ రాకముందు మెడికల్ ఎడ్యుకేషన్ బహిరంగ వ్యాపారంగా ఉండేదని, భారీ అవినీతి జరిగేదని కేంద్ర మంత్రి జేపీ నడ్డా చెప్పారు. నీట్ను వ్యతిరేకిస్తూ డీఎంకే ఎంపీ అబ్దుల్లా రాజ్యసభలో ప్రైవేటు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై మంత్రి స్పందించారు. నీట్ ప్రవేశపెట్టక ముందు ఒక్కో పీజీ సీటు రూ.8కోట్ల నుంచి రూ.13 కోట్ల వరకు అమ్ముడుపోయేదని తెలిపారు. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవన్నారు.
Similar News
News December 11, 2025
టాస్ గెలిచిన భారత్

ముల్లాన్పూర్ వేదికగా రెండో టీ20లో భారత్-సౌత్ ఆఫ్రికా తలపడుతున్నాయి. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది.
IND ప్లేయింగ్ XI: అభిషేక్, గిల్, సూర్యకుమార్ యాదవ్(C), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, దూబే, జితేశ్ శర్మ, అర్ష్దీప్, అక్షర్ పటేల్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి
SA ప్లేయింగ్ XI: రీజా, డికాక్, మార్క్రమ్(C), బ్రెవిస్, మిల్లర్, ఫెరీరా, లిండే, జాన్సెన్, సిపామ్లా, లుంగి ఎంగిడి, బార్ట్మన్
News December 11, 2025
నచ్చినవి తింటూనే తగ్గొచ్చు

శీతాకాలం వస్తే చాలు ఒంటికి ఎక్కడలేని బద్ధకం వస్తుంది. వ్యాయామం పక్కన పెట్టడంతో బరువు పెరిగిపోతారు. ఇలా కాకుండా ఉండాలంటే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలంటున్నారు నిపుణులు. కండరాల నిర్మాణం, బలం కోసం ప్రోటీన్లు ఉన్న ఆహారాన్ని తినాలి. ముఖ్యంగా చికెన్, సీ ఫుడ్, ఎగ్స్, సోయా, నట్స్, సీడ్స్ వంటి లీన్ ప్రోటీన్ ఫుడ్స్ తినాలి. క్యారెట్లు, ముల్లంగి, బీట్రూట్, ఆకుకూరలు, సీజనల్ ఫ్రూట్స్ ఎక్కువగా తినాలి.
News December 11, 2025
US దారిలో మెక్సికో.. భారత్పై 50% టారిఫ్స్

ఏషియన్ కంట్రీస్ దిగుమతులపై గరిష్ఠంగా 50% టారిఫ్స్ విధించేందుకు మెక్సికో సెనేట్ అంగీకరించింది. ఈ నిర్ణయంతో ఇండియా, చైనా, సౌత్ కొరియా, థాయ్లాండ్, ఇండోనేషియా దేశాల 1400+ ఉత్పత్తులపై సుంకాలు 50% వరకు ఉండనున్నాయి. టెక్స్టైల్స్, ఆటోమొబైల్స్ పార్ట్స్, ప్లాస్టిక్స్, మెటల్స్, ఫుట్వేర్ ఇండస్ట్రీస్పై ప్రతికూల ప్రభావం పడనుంది. సెలక్టివ్ ఐటమ్స్పై 50%, అత్యధిక ఉత్పత్తులపై 35% వరకు టారిఫ్స్ ఉండనున్నాయి.


