News August 3, 2024
నీట్ రాకముందు ఒక్కో పీజీ సీటుకు రూ.8-13 కోట్లు: నడ్డా

దేశంలో నీట్ రాకముందు మెడికల్ ఎడ్యుకేషన్ బహిరంగ వ్యాపారంగా ఉండేదని, భారీ అవినీతి జరిగేదని కేంద్ర మంత్రి జేపీ నడ్డా చెప్పారు. నీట్ను వ్యతిరేకిస్తూ డీఎంకే ఎంపీ అబ్దుల్లా రాజ్యసభలో ప్రైవేటు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై మంత్రి స్పందించారు. నీట్ ప్రవేశపెట్టక ముందు ఒక్కో పీజీ సీటు రూ.8కోట్ల నుంచి రూ.13 కోట్ల వరకు అమ్ముడుపోయేదని తెలిపారు. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవన్నారు.
Similar News
News July 11, 2025
ఇలా చేస్తే మీ ఆధార్ వివరాలు సేఫ్: UIDAI

ఆధార్ సమాచారం దుర్వినియోగం కాకుండా కాపాడుకునేందుకు బయోమెట్రిక్ లాక్ చేసుకోవాలని UIDAI పేర్కొంది. దీనికోసం <
News July 11, 2025
జగన్ పర్యటన.. మొత్తం నాలుగు కేసులు నమోదు

AP: YS జగన్ చిత్తూరు(D) బంగారుపాళ్యం పర్యటనపై తాజాగా మరో కేసు నమోదైంది. అనుమతి లేకున్నా రోడ్షో చేపట్టారని పోలీసులు కేసు నమోదు చేశారు. పరిమితికి మించి జన సమీకరణ చేపట్టారని, రోడ్డుపై మామిడికాయలు పారబోసి షరతులు ఉల్లంఘించారని, ఫొటోగ్రాఫర్పై జరిగిన దాడి ఘటనపై 3 వేర్వేరు కేసులు పెట్టారు. CC ఫుటేజ్, వీడియోలను పరిశీలిస్తున్న పోలీసులు మరికొందరిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
News July 11, 2025
ఫీజులు పెంచాలన్న అభ్యర్థనను తిరస్కరించిన HC

TG: ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు హైకోర్టులో చుక్కెదురైంది. ఫీజులు పెంచాలన్న పలు కాలేజీల అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా ఫీజులు నిర్ణయించాలని ఫీజుల నియంత్రణ కమిటీని ఆదేశించింది. కమిటీ నిర్ణయంపైనే ఫీజుల పెంపు ఆధారపడి ఉంటుందని కాలేజీలకు న్యాయస్థానం స్పష్టం చేసింది.