News August 3, 2024

రాష్ట్రంలో డెంగ్యూ పంజా.. ఈ జిల్లాల్లోనే ఎక్కువ కేసులు

image

TG: రాష్ట్రంలో అత్యధికంగా డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. ఒక్క జులైలోనే 800 కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో 2,071 హైరిస్క్ ప్రాంతాలను గుర్తించి 33 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లు ఏర్పాటు చేసింది. HYD, RR, మేడ్చల్, సంగారెడ్డి, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో లారా వ్యాప్తి ఎక్కువగా ఉందని ప్రకటించింది. దోమల వ్యాప్తి జరగకుండా అన్ని జిల్లాల్లో అధికారులు చర్యలు చేపట్టారు.

Similar News

News February 3, 2025

అలాగైతే.. పులివెందులకు ఉపఎన్నిక: RRR

image

AP: MLA ఎవరైనా లీవ్ అడగకుండా 60 రోజులు అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు పడుతుందని Dy. స్పీకర్ రఘురామ‌కృష్ణరాజు(RRR) హెచ్చరించారు. ఒకవేళ మాజీ CM జగన్ అసెంబ్లీకి రాకపోతే పులివెందులకు ఉపఎన్నిక వస్తుందని చెప్పారు. ఆయన అసెంబ్లీకి వచ్చి తన మనోభావాలు పంచుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రతిపక్ష హోదాను స్పీకర్, CM కాదు ప్రజలు ఇవ్వాలని తెలిపారు. తన కస్టోడియల్ కేసులో సునీల్ కుమార్ పాత్ర స్పష్టమైందన్నారు.

News February 3, 2025

మరోసారి థియేటర్లలోకి క్లాసిక్ సూపర్ హిట్

image

టాలీవుడ్‌ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ మూవీ అయిన ‘గోదావరి’ మరోసారి థియేటర్లలో విడుదల కానుంది. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ క్లాసిక్ మూవీ మార్చి 1న రీరిలీజ్ కానుంది. ఈ చిత్రంలో సుమంత్, కమలిని ముఖర్జీ జంటగా నటించగా.. ఇందులోని పాటలు ఇప్పటికీ ఎంతో మందికి ఫేవరెట్. మూవీలోని ‘సీతా మహాలక్ష్మి’ పాత్రకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మరి ‘గోదావరి’ చూసేందుకు థియేటర్లకు వెళ్తున్నారా? లేదా? కామెంట్ చేయండి.

News February 3, 2025

17% పెరిగిన జీఎస్టీ ఆదాయం

image

తెలంగాణలో జీఎస్టీ, వ్యాట్ రాబడులు పెరిగాయి. జనవరిలో ఏకంగా 17 శాతం జీఎస్టీ ఆదాయం పెరిగింది. 2024 జనవరిలో రూ.3351.88 కోట్ల జీఎస్టీ వసూలు కాగా, ఈ ఏడాది JANలో రూ.3921.68 కోట్లు వచ్చాయి. గత 10 నెలల్లో జీఎస్టీ, వ్యాట్ కింద రూ.62858.55 కోట్లు వసూలు అయ్యాయి.