News August 3, 2024

SPIRITUAL: శ్రీవైష్ణవ దివ్యక్షేత్ర వైభవం ‘శ్రీరంగం’

image

108 శ్రీవైష్ణవ దివ్యక్షేత్రాల్లో భవ్యమైనది తమిళనాడులోని శ్రీరంగం. విష్ణువు రంగనాథుడిగా ఇక్కడ కొలువున్నారు. శ్రీరామానుజులవారు ఎన్నో ఏళ్లు ఈ స్వామి సేవలో తరించారు. రాములవారు ఇచ్చిన రంగనాథ విగ్రహంతో లంకకు వెళ్తూ విభీషణుడు ఇక్కడ విశ్రాంతికి ఆగారట. బయలుదేరే సమయంలో మూర్తి ఎంతకూ కదలకపోవడంతో ఇక ఇక్కడే ఆలయాన్ని నిర్మించారని స్థల పురాణం. ఢిల్లీ సుల్తాన్ కుమార్తె స్వామిపై భక్తితో ఆయనలో ఐక్యమైందని చెబుతారు.

Similar News

News December 4, 2025

సర్పంచ్.. ప్రజాస్వామ్యానికే ‘పంచ్’!

image

TG: సర్పంచ్ ఎన్నికల వేళ కొందరు ప్రజాస్వామ్యానికే సవాల్ విసురుతున్నారు. ఎలక్షన్ ప్రక్రియ మొదలైన నాటి నుంచి నిత్యం ఎక్కడో ఒకచోట సర్పంచ్ పదవులకు వేలంపాటలు జరుగుతూనే ఉన్నాయి. ఓటర్లతో పనిలేదు.. డబ్బు ఉన్నోడిదే రాజ్యం అనేలా మారిపోయింది పరిస్థితి. పైసా లేకున్నా నిజాయతీగా ఎన్నికల్లో పోటీ చేద్దామనుకునేవాడికి నిరాశే ఎదురవుతోంది. కఠిన చట్టాలతోనే వేలం పాటలకు అడ్డుకట్ట పడుతుందని ఓటర్లు అంటున్నారు.

News December 4, 2025

ఏపీకి జల్‌శక్తి మంత్రిత్వ శాఖ నోటీసులు

image

తెలంగాణ ప్రభుత్వం చేసిన ఫిర్యాదు మేరకు పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్ట్‌పై కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. వారంలోపు ప్రాజెక్టు వాస్తవ స్థితిపై సమాధానం ఇవ్వాలని పేర్కొంది. పోలవరం-నల్లమల సాగర్ డీపీఆర్ కోసం టెండర్లు పిలవడాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే.

News December 4, 2025

ఏపీ న్యూస్ రౌండప్

image

* TGలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం(D) నాయకన్‌గూడెం చెక్‌పోస్ట్ వద్ద AP CM చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కారు తనిఖీ చేసిన పోలీసులు
* ఈ నెల 11న కడప మేయర్, కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికకు SEC నోటిఫికేషన్ జారీ.. అవినీతి ఆరోపణలతో ఇటీవల కడప మేయర్‌(YCP)ను తొలగించిన ప్రభుత్వం
* మూడో వన్డే కోసం విశాఖ చేరుకున్న IND, RSA జట్లు.. ఎల్లుండి మ్యాచ్